Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రూ.66,778లతో చారిత్రాత్మక గరిష్ఠ స్థాయికి బంగారం ధరలు

gold

సెల్వి

, గురువారం, 21 మార్చి 2024 (12:12 IST)
బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. బంగారం ధరలు 10 గ్రాముల చరిత్రాత్మక గరిష్ట స్థాయి రూ.66,778కి చేరుకున్నాయి. ఈ ధరలు మునుపటి రోజు ముగింపుతో పోలిస్తే రూ. 1,028 పెరిగాయి. ఇది దాదాపు 1.5 శాతం పెరిగింది.
 
అంతర్జాతీయ మార్కెట్‌లో, ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం ధరలు తొలిసారిగా ఔన్స్‌కు 2,200 డాలర్లకు చేరుకున్నాయి. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ప్రమాదాలు, చైనా నేతృత్వంలోని సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు కూడా బంగారం ధరలకు ఆజ్యం పోశాయి. 
 
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ వివాదం కూడా బంగారం ధరల పెంపుకు కారణం అయ్యింది. వివాహ సీజన్‌లో దేశీయ మార్కెట్‌లో బంగారానికి డిమాండ్ స్థిరంగా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్చి 31వ తేదీ ఆదివారమే... అయినా బ్యాంకులకు పనిదినమే : ఆర్బీఐ గవర్నర్