Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారతీయ రైలు పట్టాలపైకి 'స్వర్ణ' బోగీలు

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనతో పాటు... సురక్షిత ప్రయాణం కోసం భారతీయ రైల్వే సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతోంది. ఇందులోభాగంగా, స్వర్ణ బోగీలను తయారు చేసింది. వీటిని సరికొత్త హం

భారతీయ రైలు పట్టాలపైకి 'స్వర్ణ' బోగీలు
, గురువారం, 30 నవంబరు 2017 (12:10 IST)
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనతో పాటు... సురక్షిత ప్రయాణం కోసం భారతీయ రైల్వే సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతోంది. ఇందులోభాగంగా, స్వర్ణ బోగీలను తయారు చేసింది. వీటిని సరికొత్త హంగులతో, అధునాతనంగా తీర్చిదిద్దారు. 
 
ఈ స్వర్ణ రైలు పెట్టెలను న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ఆవిష్కరించారు. రాజధాని ఎక్స్‌ప్రెస్‌ల కోసం తయారు చేసిన వీటిని తొలుత సియాల్దా - ఢిల్లీ ప్రాంతాల మధ్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు అనుసంధానం చేస్తారు. చూడగానే ఆకట్టుకునేలా పెట్టె లోపలి భాగాలను తీర్చిదిద్దడంతో పాటు మెరుగైన కాంతి కోసం ఎల్‌ఈడీ దీపాలను వీటిలో అమర్చారు. 
 
మరుగుదొడ్లలో దుర్గంధం రాకుండా ఏర్పాట్లు చేశారు. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వాష్‌ బేసిన్లను అమర్చారు. రాత్రిపూట కూడా బెర్తుల సంఖ్యలు సులభంగా తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. తలుపుల వద్ద సీసీటీవీ కెమెరాలను అమర్చారు. మొదటి తరగతి ఏసీ పెట్టెల్లో సులభంగా పైబెర్తులకు చేరుకునేందుకు వీలైన నిచ్చెనలు బిగించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జడ్జి సాక్షిగా బోనులో విషం తాగిన యుద్ధఖైదీ (వీడియో)