Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాణిజ్య సిలిండర్ ధర పెరిగింది...

gas cylinder
, శుక్రవారం, 1 డిశెంబరు 2023 (17:32 IST)
వాణిజ్య సిలిండర్ ధర పెరిగింది. ప్రతి నెల ఒకటో తేదీన ఈ ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో 19 కిలోల కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.21 ఎగబాకింది. దీంతో దేశ రాజధాని దిల్లీలో సిలిండర్ ధర రూ.1,796.50కు చేరింది. ముంబైలో ఈ ధర రూ.1,749గా ఉంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా సవరణలు చేసినట్లు ఇంధన రిటైల్‌ కంపెనీలు తెలిపాయి. అదేసమయంలో 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్‌ ధర రూ.903 వద్ద స్థిరంగా ఉంది.
 
మరోవైపు విమాన ఇంధన ధరల్లో ప్రభుత్వ రంగ ఇంధన రిటైల్‌ కంపెనీలు మరోసారి కోత విధించాయి. దిల్లీలో ఒక్కో కిలోలీటర్‌ ధర రూ.5,189.25 తగ్గి రూ.1,06,155.67కు చేరింది. ఏటీఎఫ్‌ ధరను తగ్గించడం ఈ నెలలో ఇది రెండోసారి. నవంబర్‌ ఒకటో తేదీన కిలోలీటర్‌పై రూ.6,854.25 తగ్గిన విషయం తెలిసిందే. అంతకుముందు జులై 1 నుంచి నాలుగు దశల్లో కంపెనీలు ఏటీఎఫ్‌ ధరను రూ.29,391.08 పెంచాయి. తాజాగా రెండుసార్లు తగ్గించడంతో విమానయాన సంస్థలపై కొంత మేర భారం తగ్గినట్లయింది.
 
మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. గత 21 నెలలుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.72, డీజిల్‌ ధర రూ.89.62 దగ్గర ఉంది. చివరిసారి ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన 2022 మేలో ఇంధన రిటైల్‌ కంపెనీలు ధరల్ని సవరించాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయా : మంత్రి కేటీఆర్