Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా రూ. 125కొత్త నాణెం..

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతులు మీదుగా జూన్ 29 (శుక్రవారం) కొత్త రూ.125 నాణెం విడుదల కానుంది. గణాంకాల నిపుణుడు పీవీ మహాలనోబిస్ 125వ జయంతి సందర్భంగా ఈ నాణేన్ని విడుదల చేయనున్నారు.

ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా రూ. 125కొత్త నాణెం..
, గురువారం, 28 జూన్ 2018 (12:33 IST)
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతులు మీదుగా జూన్ 29 (శుక్రవారం) కొత్త రూ.125 నాణెం విడుదల కానుంది. గణాంకాల నిపుణుడు పీవీ మహాలనోబిస్ 125వ జయంతి సందర్భంగా ఈ నాణేన్ని విడుదల చేయనున్నారు. 
 
మహాలనోబిస్‌ జయంతినే కేంద్రం, గణాంకాల దినోత్సవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతేడాది దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రత్యేక రోజుల కేటగిరిలో జూన్‌ 29ను గణాంకాల దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం 2007లో నిర్ణయించింది. 
 
సామాజిక-ఆర్థిక ప్రణాళికల్లో, పాలసీ రూపకల్పనలో గణాంకాలు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా గణాంకాలపై ప్రజలకు అవగాహన కల్పించే రీతిలో జూన్‌ 29న కోల్‌కతాలో గణాంకాల దినోత్సవాన్ని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ (ఐఎన్ఐ), స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రొగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ మంత్రిత్వ శాఖ నిర్వహించనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పీసీ సమీప బంధువు హత్య.. 2 రోజులు కారులో తిప్పారు.. వివాహేతర సంబంధమే?