Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎఫెక్టు : రూ.2.5 లక్షల కోట్లు ఆవిరి

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎఫెక్టు : రూ.2.5 లక్షల కోట్లు ఆవిరి
, సోమవారం, 10 డిశెంబరు 2018 (17:23 IST)
వచ్చే యేడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం ఉదయం వెల్లడికానున్నాయి. ఈ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ ఫలితాలు వెల్లడయ్యేందుకు ఒక్క రోజు ముందు ఇన్వెస్టర్ల కొంపముంచాయి. సోమవారం ఒక్కరోజే బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 713.53 పాయింట్లను నష్టపోయింది. ఫలితంగా పెట్టుబడిదారుల సొమ్ము రూ.2.5 లక్షల కోట్లు ఆవిరైపోయింది. 
 
సోమవారం ట్రేడింగ్‌లో ఒకే రోజు రెండు శాతం నష్టపోయిన సెన్సెక్స్ 34,959 పాయింట్లకు చేరింది. అటు నిఫ్టీ కూడా 205 పాయింట్లు నష్టపోయి 10,488 పాయింట్ల దగ్గరకు వచ్చింది. బ్యాంకింగ్, కన్జ్యూమర్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, కాపిటల్ గూడ్స్, ఆటోమొబైల్ స్టాక్స్‌లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీనికితోడు విదేశీ పెట్టుబడులు తరలిపోవడం కూడా సెన్సెక్స్ పతనానికి కారణంగా నిలిచింది. 
 
కాగా, మంగళవారం తెలంగాణ రాష్ట్రంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. వచ్చే యేడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశ ప్రజల మూడ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ ఎన్నికలను అత్యంత కీలకంగా భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భద్రత ఇస్తే ఏకంగా ఇంట్లో చొరబడ్డ నటి... నన్ను కుక్కలా చూస్తున్నారంటోంది...