Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అత్యాధునిక రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన టాటా మోటార్స్

vehicle scrapping facility

ఐవీఆర్

, మంగళవారం, 26 మార్చి 2024 (22:07 IST)
భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు అయిన టాటా మోటార్స్, ఈరోజు దిల్లీ సమీపంలో తన ఐదవ రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీని ప్రారంభించింది; సుస్థిరమైన చలనశీలతను అభివృద్ధి చేయడంలో సంస్థ నిబద్ధతలో గణనీయమైన పురోగతిని ఇది సూచిస్తుంది. 'Re.Wi.Re- Recycle with Respect' పేరుతో ఉన్న ఈ కేంద్రాన్ని టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ గిరీష్ వాఘ్ ప్రారంభించారు.

ఈ అత్యాధునిక కేంద్రం పర్యావరణ అనుకూల ప్రక్రియలను అమలు చేస్తుంది. సంవత్సరానికి 18,000 జీవితాంతం వాహనాలను సురక్షితంగా విడదీయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. జోహార్ మోటార్స్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడిన ఆర్వీఎస్ఎఫ్ అన్ని బ్రాండ్‌ల ప్యాసింజర్, వాణిజ్య వాహనాలను బాధ్యతాయుతంగా స్క్రాప్ చేయడంలో నైపుణ్యం కలిగి ఉంది. ఈ ముఖ్యమైన మైలురాయి జైపూర్, భువనేశ్వర్, సూరత్, చండీ గఢ్‌లలో టాటా మోటార్స్ నాలుగు మునుపటి ఆర్వీఎస్ఎఫ్‌ల అద్భుతమైన విజయాన్ని అనుసరిస్తుంది, సుస్థిరమైన కార్య క్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో కంపెనీ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.
 
టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, శ్రీ గిరీష్ వాఘ్ మాట్లాడుతూ, ‘‘టాటా మోటార్స్ మొబిలిటీ భవిష్యత్తును రూపొందించడంలో నూతన వినూత్నతలు, సుస్థిరత్వంతో ముందంజలో ఉంది. సుస్థిరమైన అభ్యాసాలు, బాధ్యతాయుతమైన రీతిలో వాహన తొలగింపు మరింత అందుబాటులోకి తీసుకురావడంలో మా ఐదవ స్క్రాపింగ్ సదుపాయాన్ని ప్రారంభించడం ఒక ముఖ్యమైన ముందడుగు.

స్క్రాప్ నుండి విలువను సృష్టించడం అనేది వృత్తాకార ఆర్థిక వ్యవస్థను నిర్మించాలనే మా ఆశయానికి అనుగుణంగా ఉంటుంది. ఇది సుస్థిరమైన ఆటోమోటివ్ పద్ధతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వ ప్రయత్నాలకు కూడా దోహదపడుతుంది. ఈ అత్యాధునిక కేంద్రం వాహనాలను బాధ్యతాయుతంగా తొలగించడంలో కొత్త ప్రమాణాలను నిర్దేశి స్తుంది. అందరికీ పరిశుభ్రమైన, మరింత సుస్థిరమైన భవిష్యత్తు వైపు మార్గం సుగమం చేస్తుంది’’ అని అన్నారు.
 
Re.Wi.Re. పర్యావరణ అనుకూల పద్ధతులను ఉపయోగించడంపై దృష్టి సారించి, అన్ని బ్రాండ్‌లలో కాలం చెల్లిన ప్యాసింజర్, వాణిజ్య వాహనాలను నిర్వీర్యం చేయడానికి ఉద్దేశించిన అత్యాధునిక కేంద్రం. సెల్-టైప్, లైన్-టైప్ డిస్ మాంటలింగ్‌తో అమర్చబడి వాణిజ్య వాహనాలు, ప్యాసింజర్ వాహనాల కోసం ప్రత్యేకించబడింది. పూర్తిగా డిజిటలైజ్ చేయబడిన కేంద్రం. దీని కార్యకలాపాలన్నీ తిరుగులేని విధంగా కాగితం రహితంగా ఉంటాయి.

అదనంగా, టైర్లు, బ్యాటరీలు, ఇంధనం, ఆయిల్స్, లిక్విడ్స్, గ్యాసెస్‌తో సహా వివిధ భాగాలను సురక్షితంగా విడదీయడానికి ప్రత్యేక స్టేషన్లు ఉన్నాయి. ప్రతి వాహనం ప్యాసింజర్, వాణిజ్య వాహనాల అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన కచ్చితమైన డాక్యుమెంటేషన్, ఉపసంహరణ ప్రక్రియకు లోనవుతుంది. అలా చేయడం ద్వారా, విడదీసే ప్రక్రియ వివరాలపై గరిష్ట శ్రద్ధను నిర్ధారిస్తుంది, వాహనం స్క్రాపేజ్ విధానం ప్రకారం అన్ని భాగాలను సురక్షితంగా పారవేయడానికి హామీ ఇస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కడుపు లేని ఫుడ్ బ్లాగర్ నటాషా దిడ్డీ కన్నుమూత