Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ బ్రైటెస్ట్ స్టార్స్ రిషి శేఖర్ శుక్లా, సాయి దివ్య తేజ రెడ్డి

image

ఐవీఆర్

, గురువారం, 25 ఏప్రియల్ 2024 (18:04 IST)
టెస్ట్ ప్రిపరేటరీ సర్వీసెస్‌లో జాతీయ అగ్రగామి అయిన ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (AESL), జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్-2024 పరీక్షలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు సాధించిన అసాధారణ విజయాన్ని సగర్వంగా ఆవిష్కరించింది. రిషి శేఖర్ శుక్లా, మురికినాటి సాయి దివ్య తేజ రెడ్డి, ఇద్దరూ AESL క్లాస్‌రూమ్ విద్యార్థులు. 100 పర్సంటైల్‌ను సాధించడం ద్వారా అకడమిక్ ఎక్సలెన్స్ వార్షిక పరీక్షలలో తమ పేర్లను అగ్ర స్థానాల్లో రాసుకున్నారు. వారు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ వంటి కీలకమైన సబ్జెక్టులలో 100 పర్సంటైల్ సాధించారు.
 
వారి అద్భుతమైన ప్రదర్శన వారి అచంచలమైన నిబద్ధతను నొక్కిచెప్పడమే కాకుండా భారతదేశం యొక్క అత్యంత సవాలుగా నిలిచే పరీక్షలలో ఒకదానిలో పరీక్షించబడిన సబ్జెక్టులపై వారి లోతైన పట్టును తెరపైకి తెస్తుంది. గత రాత్రి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫలితాలలో అసాధారణ ప్రదర్శన కనబరచడం, శ్రేష్ఠతకు కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది.
 
ఆకాష్ యొక్క ప్రఖ్యాత క్లాస్‌రూమ్ ప్రోగ్రామ్‌లో చేరిన, ఈ అసాధారణ విద్యార్థులు అత్యంత కఠినమైన IIT JEEని జయించటానికి తీవ్రంగా శ్రమించారు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షలలో ఒకటిగా గుర్తింపు పొందిన పరీక్ష IIT JEE. వారి విజయం, కీలకమైన కాన్సెప్ట్ లపై పట్టు సాధించడంలో, క్రమశిక్షణతో కూడిన అధ్యయన నియమావళికి కట్టుబడి ఉండటంలో వారి ప్రయత్నం, అంకితభావానికి నిదర్శనం. వారు తమ హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తూ, “మా ప్రయాణంలో కీలకం కావటంతో పాటుగా ఖచ్చితమైన కంటెంట్, కోచింగ్‌తో మా విజయానికి తోడ్పడిన ఆకాష్‌కు రుణపడి ఉంటాము. వారి మార్గదర్శకత్వం లేకుండా, అతి తక్కువ సమయ వ్యవధిలో అనేక విషయాలపై పట్టు సాధించడం అధిగమించలేని సవాలుగా ఉండేది.." అని అన్నారు. 
 
ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (AESL) చీఫ్ అకడమిక్ అండ్ బిజినెస్ హెడ్ శ్రీ ధీరజ్ మిశ్రా విద్యార్థులకు తన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, “విద్యార్థులకు సమగ్రమైన కోచింగ్, వినూత్న అభ్యాసాన్ని అందించడంలో AESL యొక్క నిబద్ధత, సంకల్పానికి వారి అద్భుతమైన ప్రదర్శన నిదర్శనం. పోటీ పరీక్షల్లో రాణించేలా వారిని శక్తివంతం చేయడంలో ఈ పరిష్కారాలు తోడ్పడతాయి. వారి భవిష్యత్ ప్రయత్నాలలో విజయం సాధించాలని మేము కోరుకుంటున్నాము” అని అన్నారు.
 
JEE (మెయిన్స్) విద్యార్థులకు వారి స్కోర్‌లను పెంచుకోవడానికి, బహుళ అవకాశాలను అందించడానికి రెండు సెషన్‌లలో రూపొందించబడింది. JEE అడ్వాన్స్‌డ్ ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(IITలు)లో అడ్మిషన్లను సులభతరం చేస్తుంది, అయితే JEE మెయిన్ భారతదేశం అంతటా అనేక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NITలు), ఇతర సెంట్రల్-ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజీలకు గేట్‌వేగా పనిచేస్తుంది. JEE అడ్వాన్స్‌డ్‌లో హాజరు కావడానికి JEE మెయిన్‌లో పాల్గొనడం తప్పనిసరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గాయానికి గాలి తగిలితే త్వరగా ఆరిపోతుంది.. లేకపోతే చీము పట్టి సెప్టిక్ అవుతుంది : డాక్టర్ సునీత