Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీఎస్సీ నర్సింగ్ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌...యంయల్‌హెచ్‌పి ఉద్యోగాలకు అర్హత

బీఎస్సీ నర్సింగ్ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌...యంయల్‌హెచ్‌పి ఉద్యోగాలకు అర్హత
విజ‌య‌వాడ‌ , శనివారం, 6 నవంబరు 2021 (09:42 IST)
రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో విడుదల చేసిన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఉద్యోగాలకు బీఎస్సీ నర్సింగ్ తోపాటు అదనంగా కమ్యూనిటీ హెల్త్ సర్టిఫికెట్ ఉన్నవాళ్లు మాత్రమే అర్హులుగా పరిగణిస్తూ, వారు మాత్రమే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. 
 
 
నోటిఫికేషన్ ప్రకారం 2020 సంవత్సరం లో బియస్సి నర్సింగ్ పాసైన అభ్యర్థులు మాత్రమే ఉద్యోగాలకు అర్హులు. దీంతో దాదాపు లక్ష మంది బీఎస్సీ నర్సింగ్ చదివిన అభ్యర్థులు ఆశలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీవ్ర నిరాశకు గురి చెయ్యడం తో ఈ విషయాన్ని సవాల్ చేస్తూ బీఎస్సీ నర్సింగ్ చదివిన ప్రతి ఒక్కరికి యం యల్  హేచ్ పి ఉద్యోగాలకు అర్హత కలిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ కి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ విద్యార్థి ఫెడరేషన్ హైకోర్టులో పిల్ దాఖలు చేయడంతో పాటు యువ న్యాయవాది గుడిపాటి శ్రీహర్ష  బాధితుల పక్షాన బలంగా వాదనలు వినిపించడం తో  వాదనలు విన్న హైకోర్ట్ బీఎస్సీ నర్సింగ్ చదివిన ప్రతి ఒక్కరు  యం యల్ హేచ్ పి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఆదేశాలు జారీ చేసింది. 
 
 
ఈ సందర్భంగా ఏ పీ ఎన్ ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు స్వచ్ఛంద ప్రసాద్ మాట్లాడుతూ బీఎస్సీ నర్సింగ్ చదివి దాదాపు లక్ష మంది నిరుద్యోగులు ఎంతో ఆశతో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన యం యల్ హచ్ పి నోటిఫికేషన్ ఆందోళనకు గురి చేసిందన్నారు. తప్పని పరిస్థితి లో కోర్టును ఆశ్రయించగా అభ్యర్థులకు అనుకూలం గా కోర్టు నిర్ణయం తీసుకోవడం గొప్ప విజయం అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో పెరిగిన పసిడి ధరలు - మగువలకు షాక్