ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ మేనేజ్మెంట్ ట్రైనీల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో మొత్తం 1080 ఖాళీలు ఉన్నాయి. వీటిలో మైనింగ్ విభాగంలో 319 పోస్టులు, ఎలక్ట్రికల్లో 159, మెకానికల్లో 145, సివిల్లో 50, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో 9, కెమికల్/ మినరల్లో 20 పోస్టులు ఉన్నాయి.
వీటితో పాటు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్లో 7, సిస్టమ్స్లో 10, ఎన్విరాన్మెంట్లో 13, జియాలజీలో 31, జియోఫిజిక్స్లో 6, మెటీరియల్ మేనేజ్మెంట్లో 17, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో 133, పర్సనల్ అండ్ హెచ్ఆర్లో 136, సేల్స్ అండ్ మార్కె టింగ్లో 19, రాజభాష (హిందీ)లో ఆరు పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు వేతన శ్రేణిగా రూ.16400-40500 అందజేస్తారు. అలాగే, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 31 మార్చి 2011 నాటికి 30 ఏళ్లు ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా డౌన్లౌడ్ చేసుకోవచ్చు. ఆనలైన్లో దరఖాస్తులను జూన్ 4వ తేదీలోపు పంపాల్సి ఉంది.