Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెన్నైలో ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారం

నలుగురు రౌడీలు కత్తితో బెదిరించి ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నై వ్యాసార్పాడి కన్నికాపురం ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల వయసున్న ఇద్దరు యువతులను కత్తితో బెదిరించి నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసా

చెన్నైలో ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారం
, గురువారం, 11 జనవరి 2018 (14:28 IST)
నలుగురు రౌడీలు కత్తితో బెదిరించి ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నై వ్యాసార్పాడి కన్నికాపురం ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల వయసున్న ఇద్దరు యువతులను కత్తితో బెదిరించి నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసారని ఎంకేబీనగర్ మహిళా పోలీస్ స్టేషన్‌లో మంగళవారం నాడు కేసు నమోదైంది. 
 
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా అదే ప్రాంతానికి చెందిన సతీష్(29), అజయ్‌పుత్తిర్(22), యువరాజ్(26), దినేష్(24) అనే రౌడీలను అదుపులోకి తీసుకుని విచారించగా, వారే ఈ అత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించారు. దీంతో పోలీసులు ఆ నలుగురిని అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా ట్రంప్ సర్కారు కొత్త బిల్లు: గ్రీన్ కార్డులను 45శాతం పెంచనున్నారట