Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెన్నై రాజధాని కాలేజీ దశ తిరిగిందా?... 1,106 డిగ్రీ సీట్ల కోసం 95,136 దరఖాస్తులు

chennai collge
, శుక్రవారం, 5 ఆగస్టు 2022 (13:32 IST)
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని ప్రభుత్వ కాలేజీల్లో రాజధాని కాలేజీ ఒకటి. నోబెల్ బహుమతి గ్రహీత సీవీ రామన్ వంటి మహానుభావులు చదివిన కాలేజీ. ఇపుడు ఈ కాలేజీ దశ తిరిగిపోయింది. జాతీయ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్.ఐ.ఆర్.ఎఫ్) ర్యాంకుల జాబితాలో వరుసగా మూడో యేడాది చోటు దక్కించుకుంది. 
 
దీంతో ఈ కాలేజీలో చేరేందుకు విద్యార్థులు అమితాసక్తి చూపుతున్నారు. ఫలితంగా 1,106 డిగ్రీ కోర్సుల్లోని సీట్లకు ఏకంగా 95,136 దరఖాస్తులు వచ్చాయి. గత యేడాది ఈ సంఖ్య 53,668 ఉన్నాయి. సాధారణంగా ఈ కాలేజీకి ప్రతి యేటా 30 వేల నుంచి 35 వేల దరఖాస్తులు వస్తుంటాయి. కానీ, ఈ దఫా సంఖ్య లక్ష వరకు చేరుకున్నాయి. 
 
ఇదే అంశంపై కాలేజీ ప్రిన్సిపాల్ ఆర్.రామన్ మాట్లాడుతూ, గత జూలై 5వ తేదీన జరిగిన కాలేజీ స్నాతకోత్సవ వేడుకలో ముఖ్యమంత్రి, పూర్వవిద్యార్థి అయిన ఎంకే స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాలేజీ అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటించారు. దీనికితోడు కలైంజ్ఞర్ పేరుతో ఆడిటోరియంను నిర్మించినట్టు ప్రకటించారు. పైగా, కళాశాల అభివృద్ధికి నిధులు కేటాయించనున్నట్టు తెలిపారు. 
 
దీనికితోడు ఎన్.ఐ.ఆర్.ఎఫ్‌లో వరుసగా మూడో ర్యాంకును కైవసం చేసుకుందన్నారు. ఇది కాలేజీపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉన్న దురాభిప్రాయాన్ని పోగొట్టిందని తెలిపారు. ఈ కారణంగానే ఈ కాలేజీలో చేరేందుకు విద్యార్థులు అమితాసక్తిని చూపుతున్నారని ఆయన వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి, భారత్ వృద్ధి మందగమనంలో ఉందా?