Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోవిడ్ బారిన చిన్నారులు.. థర్డ్ వేవ్ ముప్పుతో భయం భయం

కోవిడ్ బారిన చిన్నారులు.. థర్డ్ వేవ్ ముప్పుతో భయం భయం
, సోమవారం, 7 జూన్ 2021 (09:33 IST)
రాష్ట్రంలో చిన్నపిల్లలు కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. రెండు రోజుల వ్యవధిలో 9మంది చిన్నారులు కోవిడ్ బారిన పడ్డారు. అంతా పదేళ్లలోపు పిల్లలే కావడం భయాందోళనకు గురి చేస్తోంది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో చిన్నారులు ఆసుపత్రి పాలవుతుండటం తల్లిదండ్రుల్లో ఆందోళన నింపింది.
 
కరోనా సోకిన పదేళ్లలోపు చిన్నారులు తొమ్మిది మంది తిరుపతి రుయా పరిధిలోని చిన్నపిల్లల ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. వీరిలో కడప జిల్లా చెందిన ముగ్గురు, చిత్తూరు జిల్లాకు చెందిన ఆరుగురు ఉన్నారు. వీరంతా శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రంలోపు చేరిన వారే. 
 
వీరిని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు రుయా అధికారులు తెలిపారు. రెండు రోజుల వ్యవధిలో ఇంతమంది పిల్లలు ఆస్పత్రిలో చేరడం రాష్ట్రంలో ఇదే తొలిసారని అధికారులు భావిస్తున్నారు. గడిచిన 15 రోజుల్లో మరో 20 మంది చిన్నారులూ చికిత్స పొంది డిశ్చార్జ్‌ అయ్యారు.
 
ఇక పుత్తూరు పట్టణం పిళ్లారిపట్టులో పదేళ్లలోపు పిల్లలు ఎనిమిది మందికి కరోనా సోకింది. వీరంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తిరుపతి రుయాకు తరలించారు. ఇటీవల వీరి తల్లిదండ్రులకు పాజిటివ్‌ రావడంతో వారి నుంచి పిల్లలకు సోకి ఉంటుందని డాక్టర్లు భావిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీలంకలో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం.. 14మంది మృతి