క్రికెటర్ల కంటే వారే గొప్ప విజేతలు: గౌతమ్ గంభీర్
ఏషియాడ్ అథ్లెట్లే నిజమైన హీరోలని టీమిండియా స్టార్ క్రికెటర్ గౌతం గంభీర్ కొనియాడాడు. అడ్డంకులను అధిగమించి విజయాలు సాధించారని, క్రికెటర్ల కంటే వారే గొప్ప విజేతలని గంభీర్ వ్యాఖ్యానించాడు. ఏషియాడ్లో భారత
ఏషియాడ్లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారని గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇప్పటికే ఏషియాడ్లో భారత ఆటగాళ్లు 15 బంగారు పతకాలు, 24 రజత, 30 కాంస్య పతకాలతో మొత్తం 69 పతకాలు సాధించారు. గతంతో పోలిస్తే భారత్కు ఇదే అత్యుత్తమం.