Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్-పాక్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్.. రాజ్ నాథ్ సింగ్ ఏమన్నారు..?

భారత్-పాక్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్.. రాజ్ నాథ్ సింగ్ ఏమన్నారు..?
, శనివారం, 23 ఫిబ్రవరి 2019 (14:46 IST)
ప్రపంచ కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ జరిగే అవకాశం లేదని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. కాశ్మీర్‌లో ఫిబ్రవరి 14న తేదీన జైషే అనే ఉగ్రవాద మూకలు నిర్వహించిన ఆత్మాహుతి దాడిలో సీఆర్పీఎఫ్ జవాన్లు 40 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
 
ఈ ఉగ్రవాద సంస్థకు పాకిస్థాన్ మద్దతిచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తద్వారా పుల్వామా దాడితో భారత్-పాక్‌ల మధ్య ప్రపంచ కప్ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 
 
ఈ మ్యాచ్‌ను యధావిధిగా జరపాల్సిందేనని ఐసీసీ తేల్చేసింది. అయితే భవిష్యత్తులో పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ ఆడకూడదని టీమిండియా మాజీ క్రికెటర్లు అంటున్నారు. కానీ సచిన్ లాంటి వారు మాత్రం పాకిస్థాన్‌లో మ్యాచ్ ఆడి తీరాల్సిందేనని చెప్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఇకపై వాణిజ్యం, క్రికెట్ వంటివి వుండవని తెలిపారు. దీంతో భారత్- పాకిస్థాన్‌ల మధ్య ప్రపంచ కప్ మ్యాచ్ జరిగే అవకాశం లేదని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ పద్ధతేం బాగోలేదు.. ఇలాగైతే కష్టం.. ఒలింపిక్ కమిటీ