Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంగ్లాండ్-భారత్ రెండో టెస్ట్ మ్యాచ్‌.. స్టేడియంలోకి అభిమానులు ఎంట్రీ

ఇంగ్లాండ్-భారత్ రెండో టెస్ట్ మ్యాచ్‌.. స్టేడియంలోకి అభిమానులు ఎంట్రీ
, గురువారం, 11 ఫిబ్రవరి 2021 (16:31 IST)
కరోనా అనంతరం ఇండియాలో మొదటి అంతర్జాతీయ సిరీస్ ఇంగ్లాండ్-భారత్ మధ్య జరుగుతుంది. అయితే ఈ 4 మ్యాచ్ ల సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లో చెన్నైలో జరుగుతున్నాయి.

అయితే ఇప్పటికే పూర్తయిన మొదటి టెస్ట్‌కు మ్యాచ్‌కు అభిమానులను అనుమతించలేదు. కానీ ఈ శనివారం నుండి ప్రారంభం కానున్న రెండో టెస్ట్ మ్యాచ్‌కు అభిమానులను స్టేడియంలోకి అనుమతించారు. 
 
అయితే రెండో టెస్టుకు హాజరయ్యే అభిమానులకు... నిర్వాహకులు కీలక సూచనలు చేశారు. స్టేడియంలోకి బైనాక్యులర్లు, స్పీకర్లు, సంగీత పరికరాలు వంటివి తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు.

సంచులు, బ్రీఫ్‌కేసులు, రేడియోలు, లేజర్‌ పాయింటర్లు, డిజిటల్‌ డైరీలు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టేప్‌ రికార్డర్లు, రికార్డింగ్‌ పరికరాలపై నిషేధం ఉన్నట్లు తెలిపారు. 2012 నుంచి మూసేసిన ఐ, జే, కే స్టాండ్లను తెరుస్తున్నామని వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సచిన్ కుమారుడికి మొండిచేయి.. ఐపీఎల్ ఆశలు గల్లంతు!