Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెంగుళూరులో నెదర్లాండ్స్ జట్టుతో మ్యాచ్ : టాపార్డర్‌కు భలే ప్రాక్టీస్... భారత్ స్కోరు 410/4

rahul - iyer
, ఆదివారం, 12 నవంబరు 2023 (18:01 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023లో భాగంగా, చివరి లీగ్ మ్యాచ్ ఆదివారం బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్, నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఈ టోర్నీలోనే అత్యధిక భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 410 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్‌లతో పాటు.. విరాట్ కోహ్లీలు అర్థ సెంచరీలోతో రాణించగా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌కు సెంచరీతో కుమ్మేశారు. ఫలితంగా భారీ టీమిండియా భారీ స్కోరు చేసింది. ఈ నెల 15వ తేదీన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత ఆటగాళ్లకు మంచి ప్రాక్టీస్‌లా నెదల్లాండ్స్ జట్టుతో మ్యాచ్ జరిగింది.
webdunia
 
కెప్టెన్ రోహిత్ శర్మ 54 బంతుల్లో 2 సిక్స్‌లు, 8 ఫోర్లతో 61 పరుగులు, మరో ఓపెనర్ గిల్ 32 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్స్‌ల సాయంతో 51 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 56 బంతుల్లో ఓ సిక్సర్, 5 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేశారు. ఆ తర్వాత క్రీజ్‌‍లోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 94 బంతుల్లో ఐదు సిక్స్‌లు 10 ఫోర్ల సాయంతో 128 పరుగులుు, కేఎల్ రాహుల్ 64 బంతుల్లో 4 సిక్స్‌లు 11 ఫోర్లతో 102 పరుగులు చేశాడు. ఆఖరులో క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ రెండు పరుగులు చేయగా, అదనంగా 15 పరుగులు వచ్చాయి. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 410 పరుగుల భారీ స్కోరు చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో మీక్రీన్, మెర్వేలు ఒక్కో వికెట్ తీయగా, లీడీ రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో డచ్ జట్టు ముంగిట 411 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ ఉంచింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరల్డ్ గెలుచుకునేందుకు ఇదే అరుదైన అవకాశం.. మిస్ చేస్తే మరో 12 యేళ్లు వేచి చూడాల్సిందే.. రవిశాస్త్రి