Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పరువు పోగొట్టుకున్న శ్రీలంక... భారత్ క్లీన్ స్వీప్

సొంతగడ్డపై శ్రీలంక పరువు పోయింది. భారత్‌తో జరిగిన టెస్ట్, వన్డే సిరీస్‌లలో ఏ ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేక పోయింది. ఫలితంగా టెస్ట్ సిరీస్‌ను 3-0 తేడాతోనూ, వన్డే సిరీస్‌ను 5-0తో భారత్‌కు అప్పగించింది.

పరువు పోగొట్టుకున్న శ్రీలంక... భారత్ క్లీన్ స్వీప్
, సోమవారం, 4 సెప్టెంబరు 2017 (06:15 IST)
సొంతగడ్డపై శ్రీలంక పరువు పోయింది. భారత్‌తో జరిగిన టెస్ట్, వన్డే సిరీస్‌లలో ఏ ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేక పోయింది. ఫలితంగా టెస్ట్ సిరీస్‌ను 3-0 తేడాతోనూ, వన్డే సిరీస్‌ను 5-0తో భారత్‌కు అప్పగించింది. 
 
ఆదివారం రాత్రి కొలంబో వేదికగా జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో లంకేయులపై సునాయాస విజయాన్ని నమోదు చేసారు. ఫలితంగా వ‌న్డే సిరీస్‌ను 5-0తో కైవ‌సం చేసుకుంది. శ్రీలంక‌పై ఐదు వ‌న్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయ‌డం ఇది రెండోసారి. గ‌తంలో 2014లోనూ భార‌త్ శ్రీలంక‌పై 5-0తో గెలిచింది. 
 
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 238 ప‌రుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత 239 రన్స్ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీమిండియా.. కెప్టెన్ కోహ్లి సెంచ‌రీ, కేదార్ హాఫ్ సెంచ‌రీ సాయంతో సునాయాసంగా గెలిచారు. 
 
46.3 ఓవ‌ర్ల‌లోనే 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేజ్ చేసింది. విరాట్‌, జాద‌వ్‌ నాలుగో వికెట్‌కు 109 ర‌న్స్‌ పార్ట్‌న‌ర్‌షిప్ నెల‌కొల్పారు. చేజింగ్‌లో ఓపెన‌ర్లు ర‌హానే, రోహిత్ వికెట్ల‌ను త్వ‌ర‌గానే కోల్పోయినా.. కెప్టెన్ విరాట్‌, మ‌నీష్ పాండే, కేదార్ జాద‌వ్ టీమ్‌ను గెలుపుబాట ప‌ట్టించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వన్డేల్లో ధోనీ రికార్డు.. స్టంపింగ్స్ సెంచరీ