Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

12 యేళ్లుగా చెత్త రికార్డును కొనసాగిస్తున్న ముంబై ఇండియన్స్.. ఏంటది?

mumbai indians

వరుణ్

, సోమవారం, 25 మార్చి 2024 (11:29 IST)
ఐపీఎల్‍‌లో ఉన్న జట్లలో ముంబై ఇండియన్స్ జట్టు ఒకటి. ఈ జట్టు గత 12 యేళ్లుగా ఓ చెత్త రికార్డును కొనసాగిస్తుంది. గత 2013 నుంచి ఆ జట్టు ఆడిన ప్రతి తొలి మ్యాచ్‌లోనూ చిత్తుగా ఓడిపోయింది. ఈ సీజన్‌లో కూడా ఆదివారం రాత్రి గుజరాత్ టైటాన్స్ జట్టుతో ఆడిన తన ప్రారంభ మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించి హార్దిక్ పాండ్యకు అప్పగించినప్పటికీ ఫలితం మాత్రం అదే పునరావృత్తమైంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసుకుంది. 
 
ఆదివారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్‌ జట్టుపై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ఉత్కంఠ భరిత పోరులో 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. గుజరాత్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. కీలక సమయంలో వికెట్లు తీసి గుజరాత్ విజయ తీరాలకు చేర్చారు. 169 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది.
 
నిజానికి రోహిత్ శర్మ, ఇంపాక్ట్ ప్లేయర్ డెవాల్డ్ బ్రెవిస్ మూడో వికెట్కు ఏకంగా 77 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ముంబై విజయం సునాయాసంగా మారింది. గుజరాత్ ఓటమి ఖాయమని అంతా భావించారు. చివరి 3 ఓవర్లలో ఆట గుజరాత్ టైటాన్స్ వైపు తిరిగింది. 18వ ఓవర్ వేసిన మోహిత్ శర్మ కీలక బ్యాటర్ టీమ్ డేవిడ్‌ను ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఆ తర్వాతి ఓవర్‌లో స్పెన్సర్ జాన్సన్ 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో సమీకరణం చివరి ఓవర్లో 19 పరుగులుగా మారింది. క్రీజులో ఉన్న కెప్టెన్ హార్ధిక్ పాండ్యా.. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో మొదటి బంతిని సిక్సర్ బాదాడు. రెండో బంతిని ఫోర్ కొట్టాడు. అయితే ఆ తర్వాత రెండు బంతుల్లో హార్దిక్, పియూష్ చావ్లాలను ఉమేశ్ యాదవ్ ఔట్ చేశాడు. చివరి 2 బంతుల్లో 9 పరుగులు అవసరమవ్వగా 2 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో ఓడిపోయింది.
 
ముంబై ఇండియన్స్ బ్యాటర్లలో రోహిత్ శర్మ (43), ఇషాన్ కిషన్ (0), తిలక్ వర్మ (25), నమన్ ధీర్(20), హార్దిక్ పాండ్యా (11), టిమ్ డేవిడ్ (11), షామ్స్ ములానీ(1 నాటౌట్), పీయూష్ చావ్లా(0), గెరాల్డ్ కోయెట్టీ (1), జస్రీత్ బుమ్రా(1 నాటౌట్), చొప్పున పరుగులు చేశారు. ఇక గుజరాత్ బౌలర్లలో ఒమర్జాయ్, ఉమేశ్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, మొహిత్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు. రవి శ్రీనివాసన్ సాయి కిశోర్కి ఒక వికెట్ పడింది. కాగా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చి కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న హార్ధిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక గాయం కారణంగా 2023 ఎడిషన్ ఐపీఎల్‌కు దూరమైన జస్రీత్ బుమ్రా ఫర్వాలేదనిపించాడు. కీలకమైన మూడు వికెట్లు తీశాడు. 
 
ఇదిలావుంటే, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు చెత్త రికార్డు వెంటాడుతుంది. ఇంతకుముందు 11 సార్లు ఈ ఫీట్‌ను రిపీట్ చేసిన ముంబై జట్టు ఆదివారం జరిగిన మ్యాచ్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. 2013 నుంచి ఇప్పటివకు ఆడిన ప్రతి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఓటమి పాలవుతుంది. అయితే, ప్రారంభ మ్యాచ్‌లో ఓటమితో ప్రారంభించి ఆ తర్వాత టోర్నీ విజేతగా నిలవడం ఈ జట్టుకు కొత్తేమీకాదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమ్మర్‌లో బిగ్ ట్రీట్.. ఆస్ట్రేలియాతో టీమిండియా గవాస్కర్ ట్రోఫీ