Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాక్ ఆటగాళ్ల పరువు తీసిన ఆ దేశ మాజీ ఆటగాళ్లు...

pakistan team
, ఆదివారం, 12 నవంబరు 2023 (15:30 IST)
భారత్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ జట్టు లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. ఆ జట్టు ఆడిన మొత్తం 9 మ్యాచ్‌లలో ఐదింటిలో ఓడిపోయింది. కేవలం నాలుగు విజయాలను మాత్రమే దక్కించుకుంది. ముఖ్యంగా, క్రికెట్ పసికూన ఆప్ఘనిస్థాన్ జట్టు చేతిలో ఓడిపోవడం పాకిస్థాన్ జట్టు ఈ టోర్నీ నుంచి నిష్క్రమించడానికి ఏకైక కారణంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో తమ జట్టు ఆటగాళ్ల ప్రదర్శనపై పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు వసీం అక్రమ్, షోయబ్ మాలిక్‌లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. 
 
ప్రపంచ కప్ మ్యాచ్‌లలో పాకిస్థాన్ జట్టు కంటే ఆప్ఘనిస్థాన్ క్రికెట్ ఆటగాళ్ళు మైదానంలో బాగా రాణించారని చెప్పారు. తమ జట్టు ఆడిన 9 మ్యాచ్‌లలో నాలుగింటిలో మాత్రమే గెలిచారని చెప్పారు. తమ కంటే కూడా ఆప్ఘనిస్థాన్ బాగా ఆడిందని ప్రశంసిచాడు. వసీం అక్రమ్ కూడా ఇంచుమించు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు. ఆప్ఘనిస్థాన్ చాలా బలంగా కనిపించిందని చెప్పారు. పైగా, తమ జట్టు తీరికలేకుండా క్రికెట్ ఆడుతుండటం వల్ల కుర్రాళ్లు కొంత అలసిపోయి ఉండొచ్చని, అందుకే ప్రపంచ కప్‌లో రాణించలేక పోయారన్నారు. ఏది ఏమైనా ఆప్ఘనిస్థాన్ జట్టు చాలా బాగా ఆడిందని వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత క్రికెట్ జట్టు దీపావళి వేడుకలు... అనుష్కతో కలిసి పాల్గొన్న కోహ్లీ