Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీలంకలో ఆసియా కప్.. వర్షంతో ఆదాయం గోవిందా.. నష్టపరిహారం కావాల్సిందే..

pakistan
, గురువారం, 7 సెప్టెంబరు 2023 (22:51 IST)
2023 ఆసియా కప్ క్రికెట్ సిరీస్‌కు ఈసారి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సింది. అయితే, పాకిస్థాన్‌లో పర్యటించేందుకు భారత జట్టు నిరాకరించడంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ టోర్నీని వేరే దేశంలో నిర్వహించాలని భావించింది. బీసీసీఐ కార్యదర్శి జైషా ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షులు. దీంతో ఆయన ఈ నిర్ణయాలు తీసుకోవడంతో పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. తర్వాత సగం మ్యాచ్‌లను పాకిస్థాన్‌లో, సగం మ్యాచ్‌లను శ్రీలంకలో భారత్ నిర్వహించాలని నిర్ణయించారు. 
 
సెప్టెంబరులో వర్షాలు ఎక్కువగా కురుస్తుండటంతో టోర్నీని శ్రీలంకలో నిర్వహించడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌తో పాటు పలు మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో అభిమానుల సంఖ్య కూడా తగ్గిపోయింది టిక్కెట్ల విక్రయాలు పడిపోయాయి.
 
ఈ సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వాల్సిన హక్కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఉండడంతో శ్రీలంకలో జరిగే మ్యాచ్‌లకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. వారు పోటీ ఆదాయంలో ఎక్కువ వాటాను కలిగి ఉన్నారు. ఈ స్థితిలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌తో పాటు పలు మ్యాచ్‌ల టిక్కెట్ల విక్రయాలు తక్కువగా ఉన్నాయని, నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు లేఖ రాసింది. 
 
ఈ లేఖ ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జేషాకు కొత్త తలనొప్పిని సృష్టించింది. శ్రీలంకలో మ్యాచ్‌ల నిర్వహించడం ద్వారా ఆదాయం తగ్గిందని.. అందుచేత తప్పకుండా నష్టపరిహారం చెల్లించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆ లేఖలో పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేఎల్ రాహుల్ కాదు.. ఇషాన్ కిషన్ దిగితేనే బెస్ట్.. గవాస్కర్