Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్ మ్యాచ్ : రోహిత్ శర్మ దూరం

న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్ మ్యాచ్ : రోహిత్ శర్మ దూరం
, శుక్రవారం, 12 నవంబరు 2021 (13:35 IST)
పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో భారత జట్టు క్రికెట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌‌లో భాగంగా ట్వంటీ20 మ్యాచ్‌ల కోసం భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరును ఎంపిక చేశారు. అలాగే, టెస్టు సిరీస్​లో తొలి మ్యాచ్​కు విరాట్ కోహ్లీ దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో అజింక్యా రెహానే కెప్టెన్​‌గా వ్యవహరించనున్నట్టు సమాచారం. 
 
ఈ నెల 17న కివీస్‌తో సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టీ20, రెండు టెస్టుల సిరీస్‌ ఆరంభం కానుంది. టీ20 ప్రపంచకప్‌ తర్వాత పొట్టి ఫార్మాట్లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లీ స్థానంలో రోహిత్‌‌కు ఆ పగ్గాలు అందించారు. అయితే, వ్యక్తిగత కారణాలు, పనిభారం కారణంగా కోహ్లీ సహా కొంతమంది కీలక ఆటగాళ్లు ఈ టీ20ల నుంచి విశ్రాంతి తీసుకున్నారు. 
 
ఇక వన్డే, టెస్టుల్లో టీమ్‌ఇండియా కెప్టెన్‌గా కొనసాగే కోహ్లీ.. కివీస్‌తో ఈ నెల 25న కాన్పూర్‌లో ఆరంభమయ్యే తొలి టెస్టుకూ దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో ఆ టెస్టులో జట్టును కొత్తగా టీ20 సారథిగా ఎంపికైన రోహిత్‌ నడిపిస్తాడా? లేదా టెస్టుల్లో వైస్‌ కెప్టెన్‌గా ఉన్న రహానె సారథిగా వ్యవహరిస్తాడా? అనే సందేహాలు రేకెత్తాయి. 
 
ఈ పరిస్థితుల్లో బ్యాట్‌తో ఫామ్‌లో లేని రహానే కంటే కూడా రోహిత్‌‌కే ఆ బాధ్యతలు అప్పగించే సూచనలు కనిపించాయి. కానీ కివీస్‌తో టెస్టు సిరీస్‌‌కు రోహిత్‌ దూరం కానున్నట్లు తాజా సమాచారం. దీంతో రహానేనే తొలి టెస్టులో కెప్టెన్‌గా ఉంటాడు. ముంబైలో జరిగే రెండో టెస్టుకు తిరిగి జట్టులోకి రానున్న కోహ్లీనే సారథిగా వ్యవహరిస్తాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ ఉప్పు తిని.. పాకిస్థాన్‌కు సపోర్ట్ చేస్తావా? సానియాపై ఫైర్