Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రధానికి సచిన్ అరుదైన జెర్సీ గిఫ్ట్.. టీషర్ట్ వెనుక "నమో" అని..

Modi
, శనివారం, 23 సెప్టెంబరు 2023 (16:29 IST)
Modi
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అరుదైన బహుమతిని అందేజేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాశీ విశ్వనాథుడు కొలువై ఉన్న వారణాసిలో నూతన క్రికెట్ స్టేడియానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. 
 
ఈ కార్యక్రమానికి ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, కార్యదర్శి జై షాతో పాటు లెజెండరీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి తదితరులు హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని మోదీకి సచిన్ అరుదైన బహుమతిని అందజేశారు. భారత క్రికెటర్ల సంతకాలతో కూడిన జెర్సీని మోడీకి మాస్టర్ గిఫ్ట్​గా ఇచ్చారు. 
 
ఈ టీషర్ట్ వెనుక "నమో" అని రాసి ఉండటం విశేషం. సచిన్​తో పాటు జై షా, రోజర్ బిన్నీ కూడా ప్రధానికి బహుమతి అందజేశారు. సంతకాలతో కూడిన ఒక స్పెషల్ బ్యాట్​ను మోడీకి ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వారణాసి: డమరుకం ఆకారంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం