Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

147 యేళ్ల టెస్ట్ క్రికెటర్‌లో ఒకే ఒక్కడు యశస్వి జైస్వాల్

Yashasvi Jaiswal

వరుణ్

, ఆదివారం, 18 ఫిబ్రవరి 2024 (20:17 IST)
భారత యువ క్రికెటర్ యశసి జైస్వాల్ రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ విజయంలో జైస్వాల్ కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో 147 యేళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్లో ఒక సిరీస్‌లో 20కు పైగా సిక్స్‌లు బాదిన తొలి క్రికెటర్‌గా అవతరించాడు. అలాగే, ఒకే ఇన్నింగ్స్‌లో 12 సిక్స్‌లు కొట్టి పాక్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్‌తో కలిసి సంయుక్తంగా యశ్విన్ అగ్రస్థానంలో నిలించాడు. ఈ క్రమంలో భారత యువ ఓపెనర్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. 
 
డబుల్స్ సెంచరీ, డబుల్ ఫిఫ్టీ, యశస్వి - సర్ఫరాజ్ ఖాన్ జోడీ అదరగొట్టేసింది. ఇంగ్లండ్‌ డబుల్ ట్రబుల్‌గా నిలిచింది. నేను వారిద్దరి ఇన్నింగ్స్‌లను మొత్తం లైవ్‌లో చూడలేకపోయా.. కానీ, వారి ఆటతీరును చెబుతుంటే విన్నా. ఇలాగే కొనసాగాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించిన భారత ఘన విజయం సాధించింది. కంగ్రాట్స్ అని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. 
 
యశస్వీ , జై.. స్వాల్ సూపర్ బ్యాటింగ్. సర్ఫరాజ్ ఖాన్ కూడా జైస్వాల్‌‍తో కలిసి ఇన్నింగ్స్ ఆడాడు. మా శుక్లా గారికి చెబుతుంటా, ఈ అబ్బాయి (యశస్వి) నాకు తెలుసు. చాలా గట్టిగ ఆడతాడు" అని సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించాడు. 
 
అద్భుతమైన విజయం. యశస్వి ఆరంభం ఎలా ఉందో.. ఇపుడూ అలాగే, అడుగులు వేస్తున్నాడు. అతడి సత్తాకు ఆకాశమే హద్దు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియా గెలిచింది. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిందని వీరేంద్ర సెహ్వాగ్ తెలపారు. ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ను యశస్వి బాగా అందుకున్నాడు. అద్భుతంగా ఆడటం అలవాటు చేసుకున్నాడు. బెన్ డకెట్‌‍ను ధ్రువ్ రనౌట్ చేయడమే మ్యాచ్‌కు హైలెట్ అని ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించిన భారత్ - 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' జడేజా