న్యూజిలాండ్తో వన్డే సిరీస్: భారత జట్టు ఇదే-యువీకి నో ఛాన్స్!
న్యూజిలాండ్తో ఐదు వన్డేల సిరీస్కు భారత జట్టును బీసీసీఐ ఖరారు చేసింది. న్యూజిలాండ్ పర్యటించే భారత జట్టులో సీనియర్ యువరాజ్ సింగ్కు స్థానం లభించలేదు. కాగా ఈశ్వర్ పాండే, స్టువర్ట్ బిన్నీ, వరుణ్ ఆరన్లు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఐదు వన్డేల సిరీస్ జనవరి 19 నుంచి ప్రారంభం కానుంది. జట్టు వివరాలు : కెప్టెన్ ధోనీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, అంబటి రాయుడు, సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, ఈశ్వర్ పాండే, స్టువర్ట్ బిన్నీ, వరుణ్ ఆరన్లు