Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహేంద్ర సింగ్ ధోనీ వీరాభిమాని ఆత్మహత్య

suicide

వరుణ్

, శుక్రవారం, 19 జనవరి 2024 (10:17 IST)
తమిళనాడు రాష్ట్రంలో భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఆత్మహత్య చేసుకున్నాడు. కడలూర్‌ జిల్లా అరంగూర్‌కు చెందిన గోపికృష్ణన్‌ (34) అన్భరసి భార్యాభర్తలు. వీరికి కిషోర్, శక్తివేల్‌ కుమారులు, 10 రోజుల క్రితమే పుట్టిన కుమార్తె ఉంది. గోపికృష్ణన్‌ ధోనికి వీరాభిమాని కావడంతో ‘చెన్నై సూపర్‌కింగ్స్‌’ను తలపించేలా పసుపు రంగులో తన ఇంటిని మార్చేసి ఫేమస్‌ అయిన విషయం తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో గోపికృష్ణన్‌ గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం రాత్రి డబ్బు విషయంలో అదేప్రాంతానికి చెందిన కొందరు గోపికృష్ణన్‌పై దాడి చేసినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన అతను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు జరిపిన దర్యాప్తులో తెలిసింది. కేసు దర్యాప్తులో ఉంది. ధోనీ వీరాభిమాని ఆత్మహత్యతో స్థానికుల్లో విషాదం నెలకొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దళిత ద్రోహి జగన్ - విగ్రహాన్ని చూసి మోసపోవద్దు.. జరిగిన దారుణాలను మర్చిపోవద్దు!