Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీ ఆలస్యంగా ఇచ్చిందనీ భార్య తల తెగనరికిన భర్త... ఎక్కడ?

murder
, బుధవారం, 20 డిశెంబరు 2023 (17:48 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. టీ ఆలస్యం ఇచ్చిందన్న కోపంతో భర్త.. భార్య తెగ నరికేశాడు. ఈ దారుణం ఘజియాబాద్ జిల్లా భోజ్‌పుర్ గ్రామంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఈ గ్రామానికి చెందిన ధరమ్ వీర్, సుందరి అనే భార్యాభర్తలకు నలుగురు పిల్లలు ఉన్నారు. మంగళవారం ఉదయం వేళ ఇంట్లో టీ ఇవ్వడం కాస్త ఆలస్యమైంది. దీంతో ఆగ్రహించిన ధరమ్ వీర్.. భార్య సుందరితో గొడవపడ్డారు. టీ పెట్టేందుకు మరికొంత సమయం పడుతుందని సుందరి చెప్పంది. దీంతో కోపోద్రిక్తుడైన ధరమ్ వీర్ పదునైన ఆయుధంతో సుందరి మెడ వెనక భాగంలో దాడి చేశాడు. 
 
సుందరి కేకలు ఉన్న ఇరుగుపొరుగువారు అక్కడకు చేరుకునేలోపే సుందరి రక్తపుమడుగులో పడి ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న ధరమ్ వీర్ కోసం గాలిస్తున్నారు. అయితే, ఈ ఘటన పిల్లలు ఇంట్లో లేని సమయంలో జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేదికవద్దకు చేరుకున్న లోకేష్ : వంద రోజుల్లో సైకో పాలనకు విముక్తి : రామ్మోహన్ నాయుడు