Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఖాళీగా ఉన్న మూవింగ్ ట్రైన్‌లో మహిళపై అత్యాచారం...

Rape
, మంగళవారం, 12 డిశెంబరు 2023 (08:23 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. ఖాళీగా ఉన్న మూవింగ్ ట్రైనులో ఓ మహిళ అత్యాచానికి గురైంది. ఈ ఘటన ఎంపీలోని సత్నా జిల్లాలో తాజాగా వెలుగు చూసింది. పకారియా - మైహార్ స్టేషన్ల మధ్య వెళుతున్న రైలులో బోగీలో ప్రయాణికులు లేకపోవడంతో ఈ దారుణం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు ఒక నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. 
 
పోలీసుల కథనం మేరరకు... 30 యేళ్ల బాధితురాలు ఊంఛేరాకు వెళ్లేందుకు కట్నీ రైల్వే స్టేషన్‌లో ఓ ప్యాసింజర్ రైలు ఎక్కింది. ఈ రైలు పకారియా స్టేషన్‌లో ఆగింది. దానిపక్కనే మరో స్పెషల్ ట్రైన్ వచ్చి ఆగింది. ఈ క్రమంలో ఆ మహిళ బాత్రూం కోసమని ఆ స్పెషల్ ట్రైనులోకి వెళ్లింది. ఇది గమనించిన నిందితుడు కమలేష్ కుశ్వాహా (22) కూడా ఆమెను అనుసరిస్తూ స్పెషల్ ట్రైనులోకి వెళ్లి తలుపులు లాక్ చేశాడి, ఆ తర్వాత కదులుతున్న రైలులోనే ఓ ఏసీ కంపార్టుమెంట్‌లోకి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఆ తర్వాత బాధితురాలు సత్నా రైల్వే స్టేషన్ వద్ద దిగి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. స్టేషన్ మాస్టర్ సాయంతో ఆ రైలును ఆ తర్వాత స్టేషనులో ఆపివేశారు. అయితే, నిందితుడు బోగీలోనే ఉండి లోపల గడియ పెట్టుకోవడంతో రైల్వే సిబ్బంది సాయంతో బోగీ తలుపులు తెరిచి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టిన వండర్‌లా