Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముఖానికి ఎలాంటి పౌడర్ రాసుకోవాలో తెలుసా?

ముఖానికి ఎలాంటి పౌడర్ రాసుకోవాలో తెలుసా?
, సోమవారం, 28 జనవరి 2019 (17:22 IST)
సరైన మేకప్ లేకపోతే.. స్త్రీలు ఎంత అందంగా ఉన్నా.. వారి ముఖం నిర్జీవంగా కనిపిస్తుంటుంది. నగరాల్లో నివసించేవారు క్రీములు, మాయిశ్చరైజ్‌లు, స్కిన్‌లోషన్లు, పౌడర్లు వాడితే.. మారుమూల గ్రామాల స్త్రీలు కనీసం పౌడర్‌నైనా వాడుతున్నారు. చర్మతత్వాన్ని బట్టి పౌడర్‌ వాడకం ఉండాలి.
 
పొడిచర్మం గలవారు, చర్మం ముడతలు పడినవారు క్రీమ్ పౌడర్ను ఉపయోగించాలి. దీనివలన చర్మం మృదువుగా తయారవుతుంది. మీది జిడ్డుచర్మమైతే మాయిశ్ఛరైజింగ్ ఎపెక్ట్స్ ఇచ్చే ఫేస్‌ పౌడర్ కొనుక్కోవాలి. టీనేజ్ అమ్మాయిలు షమ్మర్ పౌడర్ అప్లై చేసుకుంటే వారిలో అందం మాత్రమే కాదు ముఖానికి చక్కటి మెరుపు వస్తుంది. సాయంత్రం వేళల్లో పార్టీలకు వెళ్లేటప్పుడు గ్లిట్టర్ పౌడర్ ఉపయోగించాలి. 
 
పౌడర్‌ను ఎలా ఎంచుకోవాలంటే.. పౌడర్‌ను మీ చర్మ రంగును బట్టి సెలక్ట్ చేసుకోవాలి. పౌండేషన్ అప్లయ్ చేశాక ముఖానికి పౌడర్ అద్దాలి. ఈ పౌడర్ యూనిఫాంగా వుండాలి. ఫౌడర్‌ని అతిగా అప్లయ్ చేయడం మంచిది కాదు. ఎక్సెస్ ఫౌడర్‌ని రిమూవ్ చేసుకోవాలంటే పఫ్‌తో నెమ్మదిగా తుడిచి వేయాలి. ఆ తరువాత సున్నితంగా ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. 
 
మాయిశ్చరైజర్ రాసుకున్న తర్వాత పౌడర్ రాసుకుంటే బాగుంటుంది. పౌండేషన్ అప్లై చేసినప్పుడు ముందుగా ఫౌండేషన్ క్రీమ్ ముఖం మీద సరిగ్గా సెట్ అయిందా లేదో చూసుకోవాలి. ఆ తర్వాత ఫౌడర్ రాసుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

థైరాయిడ్ వ్యాధి వస్తే..?