Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చికెన్‌పాక్స్ వచ్చే సీజన్ ఇదే.... తస్మాత్ జాగ్రత్త... మచ్చలు పోవాలంటే....

వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్న పిల్లలు, గర్భిణులు ఎక్కవగా ఈ వ్యాధి భారిన పడే అవకాశం ఉంది. ఈ వ్యాధి అంటువ్యాధి లాంటిది కనుక ఒకరి నుంచి ఇంకొకరికి సులువుగా సోకుతుంది. ఈ వ్యాధి నివారణకు మందులు లేవు. కేవలం జాగ్రత్తలతో పాటు ఆరోగ్యవంతమైన ఆహారపు అలవ

చికెన్‌పాక్స్ వచ్చే సీజన్ ఇదే.... తస్మాత్ జాగ్రత్త... మచ్చలు పోవాలంటే....
, శనివారం, 14 జనవరి 2017 (16:16 IST)
వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్న పిల్లలు, గర్భిణులు ఎక్కవగా ఈ వ్యాధి భారిన పడే అవకాశం ఉంది. ఈ వ్యాధి అంటువ్యాధి లాంటిది కనుక ఒకరి నుంచి ఇంకొకరికి సులువుగా సోకుతుంది. ఈ వ్యాధి నివారణకు మందులు లేవు. కేవలం జాగ్రత్తలతో పాటు ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు, ఎసైక్లోవిర్ యాంటివైరల్ మందుల ద్వారా కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. చికెన్‌పాక్స్ వ్యాధికి కారణమైన వెరిసెల్లా వైరస్ గాలి ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాధిని (అమ్మవారు, తట్టు) వంటి పేర్లతో పిలుస్తారు. సాధారణంగా చిన్నపిల్లల్లో వచ్చే అంటువ్యాధి ఇది. 
 
వ్యాధి లక్షణాలు ముఖ్యంగా చిన్నపిల్లల్లో జ్వరంతో పాటు శరీరంపై ఎరుపురంగు బొడిపెలు వస్తాయి. ఈ బొడిపెలలో నీరు లాంటి ద్రవం నిండి ఉండి శరీరంతో పాటు నోరు, నాలుక, తల, కనురెప్పలు, చెవులు వంటి భాగాల్లో కూడా ఇవి వస్తుంటాయి. సుమారు ఐదు రోజుల నుంచి పదిరోజుల వరకు ఈ వ్యాధి ఉండే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి ఉన్న వారిని తాకినా, వారి దుస్తులను వేసుకున్నా ఈ వైరస్ సోకుతుంది. 
 
అలాగే వ్యాధిగ్రస్తులు ఎవరైనా తుమ్మినా, దగ్గినా వైరస్ గాలి ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. వ్యాధి నివారణకు ముఖ్యంగా చిన్న పిల్లలకు 12 నెలల నుంచి 15 నెలల మధ్య కాలంలో యాంటీ వైరస్ ఇంజక్షన్ వేయాలి. ఆరోగ్య వంతమైన ఆహారం తీసుకుంటు తాజా పండ్లు, కూరగాయాలు, రసాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ వ్యాధిని అశ్రద్ధ చేయరాదు.
 
శరీర చర్మంపై ఏర్పడే చికెన్‌పాక్స్ మచ్చలు పోవాలంటే నిమ్మరసంతో ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే మంచిదని వారు చెబుతున్నారు. ఇంకా చికెన్‌పాక్స్ మచ్చలు మాయమవ్వాలంటే పసుపు, కరివేపాకును మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీరంలోని చికెన్‌పాక్స్ మచ్చలపై రాసి 15 నిమిషాల తర్వాత కడిగిస్తే మంచి ఫలితం ఉంటుంది. 
 
ఇక పింపుల్స్ పూర్తిగా తొలగిపోవాలంటే నిమ్మరసాన్ని దూదితో అప్లై చేసి అరగంట తర్వాత కడిగేయండి మీ చర్మం మిలమిల మెరిసిపోతుంది. ఇంకా కొద్ది రోజులు ఇలా చేస్తే పింపుల్స్ ఉండవని బ్యూటీషన్లు అంటున్నారు. అలాగే బొప్పాయి చెట్టు నుంచి వచ్చే పాలను కాసింత తీసుకుని అందులో నీటిని చేర్చండి. ఈ బొప్పాయి పాలు, నీటి మిశ్రమంలో నానబెట్టిన జీలకర్రను కలపండి 15 నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే ముఖంలోని మచ్చలు మటుమాయం అవుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రక్తస్రావానికి కరెంటుతో ట్రీట్మెంట్...!