Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాత్రివేళ డిన్నర్ ఆలస్యంగా చేస్తున్నారా?

రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం, తిన్న వెంటనే నిద్రించడం లేదంటే బాగా ఆలస్యంగా నిద్రించడం వలన అధికంగా బరువు పెరుగే అవకాశాలున్నాయి. టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ముంది. అందు

రాత్రివేళ డిన్నర్ ఆలస్యంగా చేస్తున్నారా?
, మంగళవారం, 31 జులై 2018 (10:20 IST)
రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం, తిన్న వెంటనే నిద్రించడం లేదంటే బాగా ఆలస్యంగా నిద్రించడం వలన అధికంగా బరువు పెరుగే అవకాశాలున్నాయి. టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ముంది. అందువలన రాత్రివేళ వీలైనంత వరకు త్వరగా భోజనం చేయాలని, భోజనం చేశాక 2 గంటలు తరువాత నిద్రించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
చాలామంది రాత్రిపూట భోజనం ఆలస్యంగానే చేస్తుంటారు. అలాంటి వారికి అనారోగ్య సమస్యలే కాకుండా క్యాన్సర్ వ్యాధులు వచ్చే ప్రమాదాలున్నాయి. రాత్రిపూట 9 గంటల తరువాత భోజనం చేసే వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ 9 లోపు భోజనం చేస్తే క్యాన్సర్ వచ్చే అవకాశాలు 26 శాతం వరకు తక్కువగా ఉన్నాయి. 
 
అలాకాకుంటే ఇంగా ముందే భోజనం చేస్తే ఆ అవకాశం 16 శాతం వరకు తగ్గుతుందని పరిశోధనలో తెలియజేశారు. అందువలన రాత్రిపూట ఎంత త్వరగా భోజనం చేస్తే ఆరోగ్యానికి అంత మంచిది. ఈ సైంటిస్టులు పరిశోధనకు ఎంచుకున్న వారిలో 621 మంది పురుషులకు ప్రోస్టేట్ క్యాన్సర్, 1205 మహిళలకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లుగా తెలిసింది. కాబట్టి రాత్రిపూట భోజనం వీలైనంత వరకు త్వరగా చేస్తే ఇలాంటి సమస్యలు దరిచేరువు. ఆరోగ్యంగా కూడా ఉంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్ట్రాబెర్రీలను తరుచుగా తీసుకుంటే? హార్మోన్స్ ఉత్పత్తికి....