Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాగి పాత్రలోని నీటిని తాగితే అజీర్ణం మటుమాయం

రాగి పాత్రలోని నీటిని తాగితే అజీర్ణం మటుమాయం
, సోమవారం, 22 అక్టోబరు 2018 (15:46 IST)
మన పూర్వీకులు రాగిపాత్రలను విరివిగా ఉపయోగించేవారు. ఆ కారణంగానే వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. సుదీర్ఘకాలం పాటు జీవించారు. కానీ, నేటితరం మనుషులు నిరంతరం రోగాలతో యుద్ధం చేస్తున్నారు. చీటికీమాటికీ అనారోగ్యంపాలవుతున్నారు.
 
ప్రస్తుతం కనిపిస్తున్న ఆరోగ్య సమస్యలు ఆ కాలపు మనుషులను పెద్దగా బాధించేవి కావు. దీనికి కారణం వారి జీవనవిధానమే. అప్పట్లో ఎక్కువగా రాగి, ఇత్తడి పాత్రలు వాడటం వల్లే వారి ఆరోగ్యం అంత బేషుగ్గా ఉండేదని వారు అభిప్రాయపడుతున్నారు. 
 
* రాగి పాత్రలో 3 గంట‌లపాటు నీటిని నిల్వ ఉంచినట్లయితే ఆ నీటిలోని క్రిములు నశిస్తాయి. దీంతో ఆ నీరు ప‌రిశుభ్రంగా మారుతుంది. 
* ఇత్త‌డి పాత్ర‌ల‌ను జింక్‌, అలాయ్ మిశ్ర‌మంతో త‌యారు చేస్తారు. 
* జింక్ వ‌ల్ల మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతంది. అందుకే ఇత్త‌డి పాత్ర‌ల్లో నీటిని తాగ‌వ‌చ్చు. లేదా ఆ పాత్రల్లో వంట చేసుకుని తిన‌వ‌చ్చు. 
 
* రాగి పాత్ర‌ల్లో నిల్వ ఉంచిన నీటిని తాగ‌డం వ‌ల్ల అసిడిటీ, అజీర్ణం, డ‌యేరియా, కామెర్లు, కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. 
* అధిక బ‌రువు సమస్య త‌గ్గిపోతుంది. గుండె స‌మ‌స్య‌లు రావు. కేన్స‌ర్ క‌ణాలు న‌శిస్తాయి. థైరాయిడ్ గ్రంథి ప‌నితీరు మెర‌గ‌వుతుంది. 
* ర‌క్త‌హీన‌త పోతుంది. హైబీపీ త‌గ్గుతుంది. ఇప్పటికైనా రాగి, ఇత్తడి పాత్రలు వాడటం అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చని వారు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉల్లిపాయలు కట్ చేస్తున్నారా.. ఇలా చేస్తే..?