Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నడిస్తే పాదాలకు ఏమవుతుందో తెలుసా?

నడిస్తే పాదాలకు ఏమవుతుందో తెలుసా?
, బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (11:14 IST)
మనిషి శరీర భాగాల్లో పాదాలు కూడా ముఖ్యమైనవి. ఈ పాదాలు మనిషి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతాయి. ముఖ్యంగా, ఒక చోటు నుంచి మరోచోటకు వెళ్లేందుకు ఎలాంటి ఇంధనం లేకుండా హాయిగా నడిచి వెళ్లొచ్చు. ఇలాంటి పాదాల గురించి మీరు తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. 
 
ప్రతి మనిషి జీవితకాలంలో పాదాలు సగటున 1.85 లక్షల కిలోమీటర్లు నడుస్తాయట. ఈ దూరం భూమిని నాలుగు సార్లు చుట్టి వచ్చిన దాంతో సమానంగా చెపుతారు. చూడటానికి చిన్నగా కనిపించినా మానవ శరీరంలో ఉండే ఎముకల్లో 25 శాతం పాదాల్లోనే ఉంటాయి. 
 
ఒక పాదంలో 23 ఎముకలు, 32 కీళ్లు, 107 లింగమెంట్స్, 19 కండరాలు ఉంటాయి. అందుకే అడుగు సరిగ్గా వేయకుంటే వీటిలో ఏదో ఒకటి దెబ్బతినే అవకాశం ఉంది. రెండు పాదాల్లో కలిసి 2.50 లక్షల శ్వేద గ్రంధులు ఉంటాయి. వీటి ద్వారా రోజుకు 200 మిల్లీ లీటర్ల చెమట ఉత్పత్తి అవుతుంది. 
 
పరుగెత్తేటపుడు మనిషి బరువు కంటే నాలుగు రెట్ల బరువు పాదాలపై పడుతుంది. ఉష్ణ ప్రాంతాల్లో ఉండే వారిలో చేతి, కాలి గోళ్లు వేగంగా పెరుగుతాయట. 
 
అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి పది మంది మహిళలు తమ పాదాల కంటే తక్కువ సైజు చెప్పులు వాడుతూ పాదాలకు హాని కలిగిస్తున్నారు. మగవాళ్ళతో పోల్చితో ఆడవారిలో పాదాలకు సంబంధించిన సమస్యలు నాలుగు రెట్లు అధికంగా ఉంటాయని ఆర్థోపెడిక్స్ వైద్యులు చెపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాత్రి పడుకునే ముందు వెల్లుల్లిని అలా పెట్టుకోకూడదు...