Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆరు నెలల పాటు చేపలు తీసుకుంటే..?

ఆరు నెలల పాటు చేపలు తీసుకుంటే..?
, బుధవారం, 7 నవంబరు 2018 (14:30 IST)
ఈ చలికాలంలో చిన్నారులకు ఆస్తమా, శ్వాసకోశ వంటి వ్యాధులు వస్తుంటాయి. ఇంకా చెప్పాలంటే అధిక బరువు గలవారు కూడా ఆస్తమా వ్యాధికి బాధపడుతుంటారు. దాంతో పాటు చెడు కొలెస్ట్రాల్ కూడా వారిని బాధిస్తుంది. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందాలంటే.. ఏం చేయాలో పరిశీలిద్దాం..
 
1. చేపలతో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, న్యూట్రియన్స్, మినరల్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పిల్లల్లో వచ్చే ఆస్తమా, శ్వాసకోశ వ్యాధుల నుండి కాపాడుతాయి. దాంతో పాటు కంటి చూపును మెరుగుపరుస్తాయి.
 
2. ఆస్తమా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఆరునెలల పాటు చేపలతో తయారుచేసిన వంటకాలు ఆహారంగా తీసుకుంటే వ్యాధి రాదని అధ్యయంలో తెలియజేశారు. తద్వారా శరీరంలో ఎప్పటి కొలెస్ట్రాల్ చేరదని వెల్లడైంది.
 
3. అంతేకాకుండా వారంలో రెండుసార్లు చేపలు తీసుకోవడం వలన ఊపిరితిత్తుల్లో వచ్చే వాపు కూడా తగ్గుతుందని పరిశోధనలో స్పష్టం చేశారు. ఈ వాపు తగ్గిందంటే.. ఆస్తమా కంట్రోల్ ఉంటుంది. 
 
4. చేపలు చిన్నారులకే కాదు పెద్దలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. చాలామంది డయాబెటిస్‌తో బాధపడుతుంటారు. ఈ వ్యాధి నుండి ఎలా బయటపడాలో తెలియక చికిత్సలు తీసుకుంటూ.. మందులు వాడుతుంటారు. ఈ మందులు వాడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
5. వ్యాధిని అదుపులో ఉంచడానికి చేపలు చాలా ఉపయోగపడుతాయి. కనుక ప్రతిరోజూ మీరు తీసుకునే ఆహార పదార్థాల్లో చేపలను ఒక భాగం తీసుకుంటే వ్యాధి అదుపులో ఉంటుంది. తద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవు.   

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ రకం పిజ్జాలు ఆరగించే స్త్రీలు.. భాగస్వామితో ఎంజాయ్ చేయాలని భావిస్తారట...