Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోజువారి భోజనం ఎలా చేయాలంటే..?

రోజువారి భోజనం ఎలా చేయాలంటే..?
, శుక్రవారం, 14 డిశెంబరు 2018 (16:11 IST)
కొందరైతే ఎప్పుడు చూసిన అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అందుకోసం ఏవేవో మందులు, మాత్రలు వాడుతుంటారు. వీటి వాడకం కంటే ఈ పద్ధతులు పాటిస్తే చాలంటున్నారు నిపుణులు. అవేంటో ఓసారి తెలుసుకుందాం..
 
1. ప్రతి రోజు పండ్లను సేవించాలి. కనీసం రోజుకు ఒక పండునైనా ఆహారంగా తీసుకోవాలి. మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసే ముందు తప్పనిసరిగా సలాడ్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
 
2. మీరు తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకోండి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్యంగా ఉండేందుకు ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. 
 
3. ఒకేసారి ఎక్కువగాను లేదా మరీ తక్కువగాను ఆహారాన్ని భుజించకూడదు. సమపాళ్ళల్లోనున్న ఆహారాన్ని భుజించాలి. రాత్రిపూట మీరు తీసుకునే ఆహారం చాలా తక్కువగా ఉండేలా చూసుకోండి. తీసుకునే ఆహారాన్ని బాగా నమిలి తినాలి. అప్పుడే అది జీర్ణమవుతుంది.
 
4. వంటకాల్లో ఉప్పు తక్కువగా ఉపయోగించాలి. గోధుమ పిండిని జల్లెడ పట్టకుండా రొట్టెలు చేసుకుని తీసుకోవాలి. ఎందుకంటే ఇందులోనున్న పీచు పదార్థం శరీరానికి చాలా మంచిది.  
 
5. వీలైనంత మేరకు ఫాస్ట్ ఫుడ్‌ను తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. వయసు పెరిగేకొద్దీ ఆహార నియమాలను పాటించాలి. వీలైనంత తక్కువగా ఆహారాన్ని సేవించేందుకు ప్రయత్నించాలి. మీరు తీసుకునే ఆహారంలో పసుపు, నారింజ, ఆకుపచ్చ రంగుల్లోనున్న కూరగాయలను తప్పక తినాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాటుక ఎందుకు పెట్టుకోవాలి..?