Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జ్వరము వచ్చిన వారిలో...?

జ్వరము వచ్చిన వారిలో...?
, శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (10:00 IST)
వాత రోగములు కలిగినపుడు రోగులకు నాలుక చల్లగానూ, గరుకుగానూ, పగుళ్ళు కలిగి ఉంటుంది. పిత్త రోగములు కలిగినపుడు నాలుక బాగా ఎర్రగా ఉంటుంది. కఫరోగములు కలిగినపుడు నాలుక పాలిపోయినట్లు, జిగట గానూ ఉంటుంది. నాలుక మిశ్రమ రంగుల కలిగివున్నచో మిశ్రమ వ్యాధులు ఉన్నట్లు తెసుకోవాలి. 
 
జ్వరము వచ్చిన వారిలో నాలుక ముదురు ఎరుపుగా మారుతుంది. ముళ్ళు గుచ్చుకుంటున్నట్లు, తడారిపోవడం జరుగుతుంది. వాత రోగాలు కలిగినప్పుడు కళ్ళు పొగరంగు కలిగి చంచలముగా, మంటగా ఉంటాయి. పిత్త వ్యాధులు కలిగినపుడు కళ్ళు దీపపు కాంతిని కూడా చూడలేక మంటగా పచ్చబడుతున్నట్లు ఉంటాయి. కఫ రోగాలు కలిగినపుడు కళ్ళు జిడ్డుగా, నీళ్ళూరూతూ కళావిహీనమై ఉంటాయి. 
 
మనిషి యొక్క దృష్టి, చెవులు, చర్మం సరిగావుంటే.. వ్యాధి నివారణకు వాడు ఔషధములు త్వరగా పనిచేసి వ్యాధి నివారణగును. పాదాలు వెచ్చగా ఉండి, నాలుక మృదువుగానున్న వ్యాధులు త్వరగా నివారణమవుతాయి. జ్వరం నందు చెమట కలుగకుండా, ఊపిరికి అంతరాయము లేకుండా.. గొంతులో కఫం లేకుండా ఉంటే.. వ్యాధులు త్వరగా నయమగును. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రావి ఆకులను గ్లాసున్నర నీటిలో వేసి తాగితే...