Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒత్తిడిని దూరం చేయాలంటే.. చేపలు, పుట్టగొడుగులు తినాల్సిందేనా?

ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. ముడిధాన్యాలు, సీ ఫుడ్స్ అధికంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మటన్, చికెన్‌ను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలని వారు చెప్తున్నారు. విటమిన్‌-డి లోపం వల్ల మానసిక

ఒత్తిడిని దూరం చేయాలంటే.. చేపలు, పుట్టగొడుగులు తినాల్సిందేనా?
, ఆదివారం, 16 సెప్టెంబరు 2018 (11:07 IST)
ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. ముడిధాన్యాలు, సీ ఫుడ్స్ అధికంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మటన్, చికెన్‌ను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలని వారు చెప్తున్నారు. విటమిన్‌-డి లోపం వల్ల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే ఉదయం ఎండలో తిరగడం లేదా చేపలూ పుట్టగొడుగులూ తినటం చేయాలని వారు సూచిస్తున్నారు. 
 
వీటితో పాటు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా వున్న ఆహారమైన చేపలు, అవిసె, బాదం, పిస్తా, వాల్‌నట్స్‌ తీసుకోవాలి. విటమిన్‌-ఎ, సి, ఇ లు శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటం ద్వారా మెదడు కణాలను రక్షిస్తాయి. కాబట్టి ఇవి సమృద్ధిగా ఉండే పండ్లూ కూరగాయల్ని తినడం వల్ల ఒత్తిడిపరమైన సమస్యలన్నీ తగ్గుతాయి. 
 
ముడిధాన్యం, పాలు, గుడ్లు, చేపలతోపాటు ఆకుకూరలూ పండ్లూ బీన్స్‌ వంటివి తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇంకా ఒత్తిడిని ఇవి దూరం చేస్తాయని ఆరోగ్య నిపుణులు సెలవిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్పాహారంలో నీళ్లకు బదులు పాలు వాడితే..