Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

8 సమస్యలకు ఖర్జూరాలతో ప్రయోజనం, ఏంటవి?

8 సమస్యలకు ఖర్జూరాలతో ప్రయోజనం, ఏంటవి?

సిహెచ్

, గురువారం, 25 జనవరి 2024 (16:53 IST)
ఖర్జూరాలు. వీటిని రాత్రిపూట పాలతో కలిపి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కండరాల శక్తిని పెంపొందించడం, శక్తి స్థాయిలు పునరుద్ధరించడం, రక్తహీనత చికిత్స వంటి ప్రయోజనాలతో పాటు ఇంకా ఏమేమి వున్నాయో తెలుసుకుందాము.
 
రుతుక్రమం: ఖర్జూరం తినడం వల్ల బహిష్టు సమయంలో వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
 
బెడ్‌వెట్టింగ్: పిల్లలు నిద్రలో మూత్ర విసర్జన చేస్తుంటే ఖర్జూరంతో పాటు పాలు ఇవ్వండి.
 
రక్తపోటు: ఖర్జూరంతో కాచిన పాలను ఉదయం, సాయంత్రం త్రాగితే కొద్ది రోజుల్లోనే తక్కువ రక్తపోటు నుండి బైటపడతారు.
 
మలబద్ధకం: ఉదయం, సాయంత్రం మూడు ఖర్జూరాలు తిన్న తర్వాత గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది.
 
మధుమేహం: తీపి పదార్థాలు, చక్కెర మొదలైనవి నిషేధించబడిన మధుమేహ రోగులు పరిమిత పరిమాణంలో ఖర్జూరం పాయసం తీసుకోవచ్చు.
 
గాయాలు: ఖర్జూరపు ముద్దలను కాల్చి బూడిద చేయండి. ఈ భస్మాన్ని గాయాలపై పూస్తే గాయాలు మానుతాయి.
 
దగ్గు : ఎండు ఖర్జూరాలను నెయ్యిలో వేయించి రోజుకు 2-3 సార్లు తీసుకుంటే దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.
 
పేను: ఖర్జూరపు పొడిని నీళ్లలో నూరి తలకు పట్టించడం వల్ల తలలోని పేను నశిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Acidity కడుపులో మంట తగ్గించుకునేందుకు చిట్కాలు