Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉదయాన్నే అల్పాహారం ఎందుకు తినాలి?

ఉదయాన్నే అల్పాహారం ఎందుకు తినాలి?
, శుక్రవారం, 1 మార్చి 2019 (22:50 IST)
రోజు మొత్తంలో తీసుకునే ఆహారంలో ఉదయం వేళ తినే ఉపాహారం అత్యంత ముఖ్యమైంది. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చెయ్యనివారికి బరువు సమస్యలు తప్పవు. రోజు గడిచేకొద్దీ శక్కి సన్నగిల్లిపోతుంది. రాత్రివేళ తీసుకునే డిన్నర్‌కు, ఉదయం వేళ తీసుకునే ఉపాహారానికి మధ్య ఇంచుమించు 8 గంటల వ్యత్యాసం ఉంటుంది. నిద్రించే సమయంలో సైతం శారీరక పనితీరుకు ఇంధనం అవసరం.
 
ఈ ఇంధనం రక్తంలో, లివర్ కండరాలలో నిక్షిప్తమైన గ్లూకోజ్ నుంచి అందుతుంది. బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే కొన్ని గంటలపాటు చురుకుగా శక్తివంతంగానే బాగానే వుంటుంది. కాని నాలుగైదు గంటల తర్వాత రక్తంలో చక్కెరస్థాయి తగ్గిపోయి నీరసం, ఏకాగ్రత లోపించడం, చిరాకు వంటి లక్షణాలు కనిపించడం మొదలవుతుంది.
 
ఉదయాన్నే ఉపాహారంగా ప్రోటీన్లు, స్టార్చ్ అధికంగా లభించే పదార్థాలు తినాలి. వీటివల్ల ఉదయం వేళంతా బ్లడ్ షుగర్ స్థాయిలు సక్రమంగా ఉంటాయి. పూర్తిస్థాయి ధాన్యాలు, పాలు, తక్కువ ఫ్యాట్ వుండే చీజ్, ఆరెంజ్ జ్యూస్, పండ్లు, పండ్ల రసం, టోస్ట్ తక్కువ కొవ్వు ఉండే పెరుగు, పండ్లు, పిజ్జా, సూప్ వంటి వాటిని కూడా ఇడ్లీ, దోసె, చపాతీ, పూరీ, ఉప్మాలతో పాటు ఉపాహారాల జాబితాలో చేర్చుకోవచ్చు. చక్కర అధికంగా ఉండే బ్రేక్ ఫాస్ట్ మంచికాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉసిరిపొడిలో చెంచా పెసరపిండి, చెంచా నిమ్మరసం కలిపి...