Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రధాని మోడీ చేతుల మీదుగా 'ఆయుష్మాన్ భారత్'కు శ్రీకారం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు మరో ప్రజారంజక పథకానికి శ్రీకారంచుట్టింది. ప్రతి ఒక్కరికీ మంచి ఆరోగ్య సేవలు అందించే నిమిత్తం ఆయుష్మాన్ భారత్ పేరుతో ఓ వైద్య బీమా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని ప్

ప్రధాని మోడీ చేతుల మీదుగా 'ఆయుష్మాన్ భారత్'కు శ్రీకారం
, ఆదివారం, 23 సెప్టెంబరు 2018 (13:50 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు మరో ప్రజారంజక పథకానికి శ్రీకారంచుట్టింది. ప్రతి ఒక్కరికీ మంచి ఆరోగ్య సేవలు అందించే నిమిత్తం ఆయుష్మాన్ భారత్ పేరుతో ఓ వైద్య బీమా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని ప్రధాని మోడీ జార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రారంభించారు. 
 
ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సేవల పథకంగా పేరున్న ఆయుష్మాన్ భారత్ - జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం (ఏబీ-ఎన్‌హెచ్‌పీఎ) లబ్ధిదారులైన కుటుంబానికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తుంది. దాదాపు 10 కోట్ల కుటుంబాలకు చెందిన 50 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ వర్తింపజేయనుంది. 
 
ఈ పథకానికి అర్హులు ఎవరు?
అయితే, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకానికి... పట్టణాల్లో చెత్త వస్తువులను ఏరేవారు, బిక్షగాళ్లు, ఇంటి పని సహాయకులు, వీధి వ్యాపారులు, హాకర్లు, నిర్మాణ రంగ కార్మికులు, తాపీ పనివారు, పెయింటర్లు, వెల్డర్లు, సెక్యురిటీ గార్డులు, పారిశుద్ధ్య కార్మికులు తదితర వర్గాల వారు అర్హులు. రాష్ట్రాల్లో అమల్లో ఉన్న రాష్ట్రీయ స్వాస్థ బీమా యోజన పథకం లబ్ధిదారులకూ ఆయుష్మాన్ భారత్ వర్తిస్తుంది. అర్హులు ఓటరు గుర్తింపు కార్డుతోగానీ, రేషన్‌కార్డుతోగానీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కోసం ఆధార్ నంబర్ నమోదు తప్పనిసరికాదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఈ కూరకు ఎంత ప్రాధాన్యం ఇస్తే అంత మంచిది