Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తీసుకునే ఆహారంలో పులుపు కచ్చితంగా ఉండాల్సిందేనా?

మనం తీసుకునే ఆహారంలో కాసింత పులుపు కూడా ఉండాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చింత పండు, నిమ్మ‌, ఉసిరి, నారింజ పండ్లను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పులుపు తీసుకోవడం ద్వారా నోటిలో లాలాజ

తీసుకునే ఆహారంలో పులుపు కచ్చితంగా ఉండాల్సిందేనా?
, శనివారం, 23 సెప్టెంబరు 2017 (11:56 IST)
మనం తీసుకునే ఆహారంలో కాసింత పులుపు కూడా ఉండాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చింత పండు, నిమ్మ‌, ఉసిరి, నారింజ పండ్లను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పులుపు తీసుకోవడం ద్వారా నోటిలో లాలాజలం ఎక్కువగా ఊరుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అయితే  పులుపు ఎక్కువగా మాత్రం తీసుకోకూడదు. మితంగా తీసుకోవాలి. 
 
అలా ఎక్కువగా తీసుకుంటే కఫ, వాత, పిత్త దోషాలు కలుగుతాయి. దృష్టి మందగిస్తుంది. శరీరం అనారోగ్యం పాలవుతుంది. ఆహారాన్ని అధికంగా జీర్ణ పరుస్తుంది. కాళ్ళు, చేతులు నీరు పడతాయి. దాహం ఎక్కువ అవుతుంది. ఎనీమియా, చర్మ వ్యాధులు, తలతిరగడం, దురదలు కలుగుతాయి. అయితే ఆమ్లా, నారింజ, బత్తాయి పండ్లను రోజుకొకటి చొప్పున తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుమార్తెకు నిశ్చితార్థమైంది.. అతనితో తిరుగుతోంది.. తొందరపడుతుందేమో...