Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శరీరానికి పట్టిన నీరు తొలగించాలంటే.. పిప్ళిళ్ళను నేతిలో వేయించి..?

శరీరానికి పట్టిన నీరు తొలగించాలంటే.. పిప్ళిళ్ళను నేతిలో వేయించి..?
, సోమవారం, 14 జనవరి 2019 (10:06 IST)
వంటికి నీరు పట్టడానికి అనేక కారాణాలున్నాయి. ముఖ్యంగా స్త్రీలలో నీరు పట్టడం అనారోగ్యం. వీటికి ఎవరిమటుకు వారే చికిత్సలు చేసుకోవచ్చును. మరి ఆ చికిత్సలేంటో ఓసారి తెలుసుకుందాం..
 
1. అల్లాన్ని మెత్తగా దంచి చిక్కగా రసాన్ని తీసి, దానిలో కొంచెం పాత బెల్లాన్ని కలుపుకుని రోజూ రెండుపూటలా నాలుగు చెంచాలు తీసుకుంటుంటే వంటికి పట్టిన నీరు తగ్గుతుంది.
 
2. పిప్ళిళ్ళను నేతిలో వేయించి, మెత్తగా దంచాలి. శొంఠిని కూడా నిప్పులమీద కాల్చి, మెత్తగా దంచి, రెంటిని సమానంగా కలిపి, బెల్లంతో నూరి తింటుంటే శరీరానికి నీరు లాగేస్తుంది. కీళ్ళ నొప్పులు, నడుంనొప్పి తగ్గిపోతుంది.
 
3. గలిజేరు తీగ పాలంగట్లు మీద పెరుగుతుంది. దీనిని తెచ్చి బాగా ఎండించి, మెత్తగా దంచి, పాలలోగానీ, మజ్జిగలో గానీ కలుపుకుని త్రాగుతుంటే వంటికి పట్టిన నీరులాగేస్తుంది.
 
4. నేలవేమును బాగా పొడిచేసి, దీనికి సమానంగా శొంఠిని తీసుకుని బెల్లంతో నూరి కుంకుడు గింజలంత మాత్రలు చేసుకుని రెండుపూటలా వేసుకుంటుంటే వంటికి పట్టిన నీరు తగ్గుతుంది.
 
5. పునర్ణవారిష్ట, రోహితకారిష్ట, శాశీసభస్మ మండూరభస్మ, లోహభస్మ, గోక్షురాది చూర్ణం, చంద్ర ప్రభావటి, స్వర్ణవంగం, త్రివంగభస్మ వంటి చాలా మందులు ఆయుర్వేదం మందుల షాపులో దొరుకుతాయి. వీటిని వాడుతున్నా వంటికి పట్టిన నీరు లాగేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పచ్చి బఠాణీలతో మలబద్దకానికి చెక్...