Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే....

శ్రావణమాసాన్ని వరాలు అందించే మాసంగా భక్తులు భావిస్తుంటారు. సౌభాగ్యాన్ని ప్రసాదించే పార్వతీదేవి, సంపదలను ప్రసాదించే లక్ష్మీదేవి భక్తులను అనుగ్రహించడం ఈ శ్రావమమాసం ప్రత్యేకంగా కనిపిస్తుంది. శ్రావణం మంగళ

శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే....
, శుక్రవారం, 27 జులై 2018 (12:11 IST)
శ్రావణమాసాన్ని వరాలు అందించే మాసంగా భక్తులు భావిస్తుంటారు. సౌభాగ్యాన్ని ప్రసాదించే పార్వతీదేవి, సంపదలను ప్రసాదించే లక్ష్మీదేవి భక్తులను అనుగ్రహించడం ఈ శ్రావమమాసం ప్రత్యేకంగా కనిపిస్తుంది. శ్రావణం మంగళవారాల్లో పార్వతీదేవిని, శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ఆరాధిస్తూ పూజలు, వ్రతాలు చేస్తుంటారు. పూజ మందిరాల్లో పార్వతి, లక్ష్మీదేవికి భక్తి శ్రద్ధలతో ధూప దీప నైవేద్యాలను సమర్పిస్తుంటారు.
 
శుక్రవారం లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లే మహిళా భక్తులు ఆ తల్లికి పండ్లతో పాటు తామర పువ్వులు లేదా గులాబీ పువ్వులను తీసుకుని వెళుతుంటారు. పరమాన్నం పార్వతిదేవికి ఇష్టమైనదిగా శాస్త్రంలో చెప్పబడుతోంది. కాబట్టి బెల్లం, ఆవుపాలు, కొసలు విరగని బియ్యంతో పరమాన్నం తయారుచేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. 
 
పరమపవిత్రమైన ఈ రోజున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తే విశేషమైన ఫలితాలను పొందవచ్చును. శ్రావణం మాసపు శుక్రవారాల్లో ఒక్కపూట మాత్రమే భోజనం చేసి, పగలు నిద్రపోకుండా, ఆ రోజంతా లక్షీదేవిని ధ్యానిస్తు కనకధారాస్తవం, లక్ష్మీదేవ అష్టోత్తరం, లక్ష్మీదేవి సహస్రనామాలు చదువుకోవడం వలన ఆ తల్లి సకల సంపదలను, సంతోషాన్ని ప్రసాదిస్తుందని చెప్పబడుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రగ్రహ దోషాలు తొలగిపోవడానికి ఇలా చేస్తే....