Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

''కురుక్షేత్రం'' మహా పవిత్రం.. ఈ ప్రాంతంలో చనిపోతే.. ఇక స్వర్గప్రాప్తి.. అందుకే?

పాండవులకు, కౌరవులకు మధ్య మహాసంగ్రామం జరిగిన ''కురుక్షేత్రం'' గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. కురుక్షేత్రం అనే పేరు.. ఎలా వచ్చిందంటే.. కురువంశ మూలపురుషుడైన కురువు పేరు మీద ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చిందంట

''కురుక్షేత్రం'' మహా పవిత్రం.. ఈ ప్రాంతంలో చనిపోతే.. ఇక స్వర్గప్రాప్తి.. అందుకే?
, సోమవారం, 17 సెప్టెంబరు 2018 (17:47 IST)
పాండవులకు, కౌరవులకు మధ్య మహాసంగ్రామం జరిగిన ''కురుక్షేత్రం'' గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. కురుక్షేత్రం అనే పేరు.. ఎలా వచ్చిందంటే.. కురువంశ మూలపురుషుడైన కురువు పేరు మీద ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చిందంటారు. కురుక్షేత్రం కంటే ముందు ఈ ప్రాంతాన్ని ''బ్రహ్మవర్త'' అని పిలిచేవారట. సృష్టికర్త బ్రహ్మదేవుడు ఈ ప్రాంతంలో యజ్ఞం చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. 
 
అంతేగాకుండా వ్యాసభగవానుడు.. ఈ తపోభూమిలోనే పురాణాలు రచించారట. 'కురుక్షేత్రం'లోనే అర్జునుడికి కృష్ణపరమాత్ముడు గీతోపదేశం చేశాడు. అలాగే అంపశయ్యపై వున్న భీష్ముడు ''విష్ణు సహస్రనామాలు" చెప్పిన పుణ్యభూమి కూడా ఇదే. అందుకే 'కురుక్షేత్రం' ధర్మక్షేత్రంగా.. తపోభూమిగా ఇప్పటికీ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. 
 
ఎంతటి పాపాలు చేసిన వారైనా ఈ ప్రదేశంలో చనిపోతే వారికి స్వర్గలోక ప్రాప్తి కలగాలని 'కురువు' దేవేంద్రుడిని కోరగా .. అందుకు దేవేంద్రుడు అనుగ్రహించాడని స్థలపురాణం. అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఈ ప్రాంతంలో మహాసంగ్రామాన్ని నిర్వహించినట్లు చెప్తారు. 
 
ఇకపోతే.. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఓ ప్రముఖ ఘట్టంగా మిగిలిపోయింది. ఈ యుద్ధం దాయాదులైన కౌరవులకు పాండవులకు మధ్య హస్తినాపుర సింహాసనం కోసం జరిగింది. కురుక్షేత్రం ఈనాటి భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో ఉంది. అప్పటి రాజ్యాలన్నీ ఈ యుద్ధంలో పాల్గొన్నాయి. కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది. భగవద్గీత మహాభారత యుద్ధ ప్రారంభంలో ఆవిర్భవించింది ఈ ప్రాంతంలోనే. శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనాన్ని ఇదే ప్రాంతంలోనే అర్జునునికి కల్పించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ వర్తమానాన్ని పట్టించుకోరు... మునీశ్వరుడు...