Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భగవంతునికి సమర్పించే నివేదన పట్ల జాగ్రత్త..?

భగవంతునికి సమర్పించే నివేదన పట్ల జాగ్రత్త..?
, శనివారం, 23 ఫిబ్రవరి 2019 (12:03 IST)
దేవుడికి సమర్పించే నివేదన పట్ల జాగ్రత్త పడాలి. మనం ఏ ఆహారం తిన్నా, నీరు తాగినా అది భగవత్ ప్రసాదమే. కాబట్టి వీటిని ముందుగా ఆయనకే సమర్పించాలి. ఇది భగవంతునికి కృతజ్ఞత తెలిపే ప్రక్రియ మాత్రమే కాదు. మంచి లక్షణం కూడా. మనుషుల్లో రెండు రకాల తత్త్వంగలవారు వుంటారు. దేవుడి పట్ల పెద్దగా విశ్వాసం లేని వారు నాస్తికభావాలు గలవారు ఒకరు కాగా, ప్రతి విషయంలోనూ భగవంతుడిని నమ్మే ఆస్తికత్వం గలవారు మరొకరు. 
 
ఇద్దరి కోరికలను తీర్చేవాడూ భగవంతుడే. వేదాలు, ఉపనిషత్తుల సారాంశాలు గ్రహించి, తనకు లభించిన వాటిని భగవంతునికి, ఇతరులకు అర్పించే వారంటే శ్రీమాన్ నారాయణుడికి వల్లమాలిన ప్రీతి. ఇటువంటి వారికి సంపదల్ని, విజయాల్ని సిద్ధింపజేస్తాడు. 
 
భగవంతునికి సమర్పించి ఆయన ప్రసాదంగా స్వీకరించిన ఆహారానికి దైవత్వం లభిస్తుంది. ఇలా భగవంతునికి నైవేద్యం సమర్పించడం అస్తికుల లక్షణం. అందుచేత భగవంతునికి సమర్పించే నివేదన విషయంలో శుచీశుభ్రతకు చోటివ్వాలి. నిష్ఠతో స్వామికి సమర్పించి ఆపై ప్రసాదంగా స్వీకరించాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

23-02-2019 - శనివారం మీ రాశిఫలితాలు - ఆర్థిక వ్యవహారాల పట్ల శ్రద్ధ వహిస్తారు...