Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ పాయసాలు.... పురుషులకు భేషుగ్గా పనిచేస్తాయి...

ఈ పాయసాలు.... పురుషులకు భేషుగ్గా పనిచేస్తాయి...
, మంగళవారం, 25 డిశెంబరు 2018 (12:36 IST)
ఆయుర్వేదం ప్రకారం గోధుమ, బియ్యం, మినప, పెసర వంటి పదార్థాలతో ఇలాంటి వంటకాలు చేసుకుంటే తింటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వాటిని తినడం వలన కలిగే ప్రయోజనాలు ఓసారి..
 
1. పాలను సగం వరకు మిగిలేటట్టుకాచి దానిలో ఎనిమిదోవంతు బియ్యాన్ని వేసి ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని పరమాన్నం, పాయసం అంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దాంతో పాటు పురుషుల్లో వీర్యాన్ని వృద్ధి చేస్తుంది.
 
2. గోధుమలతో చేసిన పాయసం మంచి బలాన్ని కలిగిస్తుంది. మేధస్సును వృద్ధిచేస్తుంది. వాత, పైత్యరోగాలను తగ్గిస్తుంది. సంభోగశక్తిని పెంచుతుంది. గోధుమ పిండితో చేసిన పరోటా మంచి బలాన్నిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు పథ్యపు ఆహారంగా తినవచ్చును. ఇది వీర్యవృద్ధిని, దృష్టిని కలిగిస్తుంది. సంభోగశక్తిని పెంచుతుంది.
 
3. గోధుమ పిండిని ఒక వంతు, దానికి ఎనిమిదివంతుల శెనగపిండిని తీసుకుని, దానిలో కొంచెం వాము, ఇంగువ, ఉప్పు, నెయ్యి కలిపి బాగా మర్ధించి, దాన్ని చిన్న చిన్న అప్పచ్చలుగా చేసి, పొగలేని నిప్పుల మీద ఎర్రగా అయ్యేంత వరకూ కాల్చాలి. వీటిని తిన్నచో మంచి బలం కలుగుతుంది. శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, వాత వ్యాధులు నిర్మూలిస్తాయి. 
 
4. మినపపిండిని తీసుకుని అందులో మిరియాలు, ఇంగువ, అల్లం.. వీటిని బాగా కలిపి నేతిలోగానీ, నూనెలో గానీ వేయించి దానిని తిన్నచో వాత వ్యాధులను తగ్గిస్తుంది. ఆకలిని వృద్ధిచేస్తుంది. పైత్య వ్యాధులను నిర్మూలిస్తుంది.
 
5. పెసరపప్పుతో చేసిన వడియాలు చాలా రుచిగా ఉంటాయి. ఇది మంచి పుష్టికరమైన ఆహారం. వీర్యాన్ని వృద్ధి చేస్తుంది. రక్తపిత్తం, వాతాన్ని తగ్గిస్తాయి. ఇవి దాహాన్ని అధికం చేస్తాయి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భోజనానంతరం నిద్రిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా..?