Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తినకూడని ఆహార కాంబినేషన్లు....

చాలా మంది భోజన ప్రియులు తమకు ఇష్టమైన కాంబినేషన్లు కంటికి కనిపిస్తే చాలు లొట్టలేసుకుని ఆరగించేస్తుంటారు. తమకు నచ్చిన కాంబినేషన్ లేకపోతే ముద్ద దిగడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే, కొన్ని కాంబినేషన్లు ఎంత

తినకూడని ఆహార కాంబినేషన్లు....
, శనివారం, 22 సెప్టెంబరు 2018 (17:31 IST)
చాలా మంది భోజన ప్రియులు తమకు ఇష్టమైన కాంబినేషన్లు కంటికి కనిపిస్తే చాలు లొట్టలేసుకుని ఆరగించేస్తుంటారు. తమకు నచ్చిన కాంబినేషన్ లేకపోతే ముద్ద దిగడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే, కొన్ని కాంబినేషన్లు ఎంత రుచిగా ఉంటాయో అంతే డేంజర్ కూడా. ఇలాంటి ఆహారం తినడం వల్ల వెంటనే ఎలాంటి ప్రభావం కనిపించకపోయినా.. క్రమేణా విషతుల్యమయ్యే ప్రమాదం లేకపోలేదని పౌష్టికాహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి అలాంటి డేంజర్ కాంబినేషన్లు ఏంటో ఓసారి పరిశీలిద్ధాం.
 
మాంసం - పాలు: పాలతో కలిపి చేపలు, చికెన్ వంటి మాంసాహారం తినకూడదు. 
పెరుగు - పండ్లు: పుల్లని పండ్లను పెరుగుతో కలిపి తీసుకోకూడదు. దీనివల్ల కడుపులో యాసిడ్స్ ఏర్పడి జీవక్రియపై ప్రభావం చూపుతాయి
పుచ్చకాయ - నీళ్లు: పుచ్చకాయలో దాదాపు 95 శాతం మేరకు నీరే ఉంటుంది. ఇది తిన్న తర్వాత నీళ్లు తాగితే.. శరీరంలోని జీర్ణ రసాలపై దుష్ప్రభావం చూపుతుంది.
టీ - పెరుగు: ఈ రెండిట్లోను యాసిడ్స్ ఉంటాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరం సమతుల్యత దెబ్బతింటుంది. జీర్ణక్రియపై కూడా ప్రభావం చూపుతుంది. 
పాలు - అరటి పండు: ఆయుర్వేద నిపుణులు పూర్తిగా వ్యతిరేకించే కాంబినేషన్ ఇదే. ఈ రెండు కలిపి తీసుకుంటే జీర్ణక్రియపై చెడు ప్రభావం చూపుతుంది. 
పాలు - నిమ్మకాయ: పాలలో నిమ్మకాయ కలిపితే విరిగిపోతాయనే సంగతి తెలిసిందే. కడుపులోకి వెళ్లినా ఇలాగే జరుగుతుంది. కడుపులో ఉండే జీర్ణరసాల్లో నిమ్మకాయ కంటే అత్యధిక యాసిడ్ గుణాలు ఉంటాయి. పాలు, నిమ్మ కాంబినేషన్ విషంగా మారే ప్రమాదం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేకపాలలో ఖర్జూర పండ్లను నానబెట్టుకుని ఆరగిస్తే...