Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంబులెన్స్‌లో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం...

అంబులెన్స్‌లో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం...
, సోమవారం, 29 అక్టోబరు 2018 (09:48 IST)
పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. మానస్థితిసరిగా లేని ఓ 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గురుద్వారా నగరానికి చెందిన మానసికస్థితి సరిగా లేని బాలిక(15) గత శనివారం అదృశ్యమయింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి ఆ బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు. 
 
కాగా బాలిక ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో రోడ్డుపై ఉన్న ఒక అంబులెన్స్‌ నుంచి బాలిక ఏడుపులు వినిపించడంతో అక్కడి వెళ్లి చూశారు. వీరి రాకను గమనించిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. అపస్మారక స్థితిలో పడిఉన్న బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించారు. 
 
తన కూతురిపై ఇద్దరు అంబులెన్స్‌ ఉద్యోగులు అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురిని కిడ్నాప్‌ చేసి అత్యాచారానికి ఒడిగట్టారని ఫిర్యాదులో తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అరెస్ట్‌ చేశారు. నిందితులు ప్రభుత్వ అంబులెన్స్‌ ఉద్యోగులైన అహ్సాన్‌ అలీ, సమీన్‌ హైదర్‌గా గుర్తించామని పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్ గూటికి గద్దర్? రాహుల్ సమక్షంలో పార్టీలో చేరిక!