Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పసికందు గొంతులో ఉప్పుపోసి చంపేసిన తల్లి.. ఎందుకో తెలుసా?

సాధారణంగా కన్నబిడ్డ ఏడిస్తే కన్నతల్లి తట్టుకోలేదు. తిరిగి ఆ బిడ్డ నవ్వేంత వరకు ఆ తల్లి ప్రాణం తల్లడిల్లిపోతుంది. కానీ, ఈ కసాయి మహిళ మాత్రం అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. గుక్కపెట్టి ఏడుస్తున్న కన్నబ

పసికందు గొంతులో ఉప్పుపోసి చంపేసిన తల్లి.. ఎందుకో తెలుసా?
, బుధవారం, 12 సెప్టెంబరు 2018 (15:48 IST)
సాధారణంగా కన్నబిడ్డ ఏడిస్తే కన్నతల్లి తట్టుకోలేదు. తిరిగి ఆ బిడ్డ నవ్వేంత వరకు ఆ తల్లి ప్రాణం తల్లడిల్లిపోతుంది. కానీ, ఈ కసాయి మహిళ మాత్రం అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. గుక్కపెట్టి ఏడుస్తున్న కన్నబిడ్డ గొంతులో ఉప్పు పోసి చంపేసింది. ఈ దారుణం బంగ్లాదేశ్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మహ్మద్ బిచ్చు, సాతీ అనే దంపతులకు మూడేళ్ళ రెండేళ్ళ బాలుడు ఉన్నాడు. ఈ దంపతులు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో బిచ్చు ఇటీవల పని మానేసి ఇంట్లో కూర్చోవడంతో పూట గడవటం కష్టంగా మారింది. దీంతో ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. 
 
ఈ నేపథ్యంలో పిల్లాడికి పాలు తీసుకురావాలని భర్తకు సాతీ డబ్బు ఇచ్చింది. కానీ అతను ఆ మొత్తాన్ని ఖర్చు పెట్టేసి చల్లగా ఇంటికి చేరుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఆమె.. పిల్లాడు ఆకలితో అలమటించడం కంటే చావడం నయమని చెబుతూ పిడికిలి నిండా ఉప్పును చిన్నారి గొంతులో పోసేసింది. ఆ పని చేసిన కొద్దిసేపటికే చేసిన తప్పు తెలుసుకుంది. వెంటనే పిల్లాడిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. మార్గమధ్యంలోనే చనిపోయినట్లు తేల్చారు. కాగా, ఈ ఘటనపై భర్త ఫిర్యాదుతో సాతీని పోలీసులు అరెస్ట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లగడపాటి షాకింగ్ సర్వే... తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమా...?