Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెరుగుతో మధుమేహం పరార్.. వారానికి మూడు రోజులు..?

పెరుగుతో మధుమేహం పరార్.. వారానికి మూడు రోజులు..?

సెల్వి

, సోమవారం, 15 ఏప్రియల్ 2024 (11:02 IST)
సాధారణ పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుందని, ఇన్సులిన్ నిరోధకతను కూడా తగ్గించవచ్చని వైద్యులు తెలిపారు. పెరుగు మధుమేహం ప్రమాదాన్ని అరికట్టడానికి చాలా కాలంగా ప్రసిద్ది చెందింది.
 
ఈ క్రమంలో మార్చిలో యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) పెరుగు తినడం వల్ల టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని మొట్టమొదటిసారిగా అర్హత పొందిన ఆరోగ్య పరిశోధనలో తేలింది. 
 
వారానికి కనీసం మూడు సార్లు పెరుగు తీసుకునే వారిలో సాధారణ జనాభాలో డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం వెల్లడించింది. రక్తంలో చక్కెరను నియంత్రించేందుకు పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుందని.. దానిలోని ప్రోబయోటిక్ కంటెంట్ పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
 
రక్తంలో చక్కెర నిర్వహణకు అవసరమైన గ్లూకోజ్ జీవక్రియ, ఇన్సులిన్ సెన్సిటివిటీని నియంత్రించడంలో మైక్రోబయోమ్ కీలక పాత్ర పోషిస్తుంది. పెరుగులోని ప్రోబయోటిక్స్ ఈ విధులను మెరుగుపరుస్తాయి.
 
మధుమేహం లేదా దాని ప్రమాదం ఉన్న వ్యక్తులకు ఇది ప్రభావవంతంగా ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు. సాదా పెరుగును ఎంచుకోవడం, అదనపు చక్కెరలను నివారించడం మంచిది. అదనంగా, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్‌లతో కూడిన సమతుల్య ఆహారంలో పెరుగును చేర్చడం మంచిది. 
 
క్రమమైన వ్యాయామంతో, మధుమేహం ప్రమాదాన్ని నిర్వహించడానికి, తగ్గించడానికి పెరుగు కీలకమని పరిశోధకులు తెలిపారు. పెరుగు అనేది అధిక పోషక విలువలు కలిగిన ఉత్పత్తి. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఇందులో పుష్కలంగా వుంటాయి. 
 
ఇంకా, పెరుగు తినడం జీర్ణశయాంతర ప్రేగు మార్గం శుద్ధి అవుతుంది. పెరుగు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఊబకాయాన్ని తగ్గించి, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాల్దీవుల కొనసాగుతున్న దళాల ఉపసంహరణ!!