Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

356 నుంచి 492 వరకు అణు బాంబులను తయారు చేసే సత్తా భారత్ సొంతం.. పాక్ మేధావి బృదం

పాకిస్థాన్‌ను షాక్‌కు గురిచేసే విషయాన్ని ఆ దేశానికి చెందిన మేధావి బృందం వెల్లడించింది. భారత్‌ను తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించింది. ఇప్పటికిపుడు సుమారు 356 నుంచి 492 వరకు అణు బాంబుల్ని తయారుచేయగలిగి

356 నుంచి 492 వరకు అణు బాంబులను తయారు చేసే సత్తా భారత్ సొంతం.. పాక్ మేధావి బృదం
, బుధవారం, 26 అక్టోబరు 2016 (13:05 IST)
పాకిస్థాన్‌ను షాక్‌కు గురిచేసే విషయాన్ని ఆ దేశానికి చెందిన మేధావి బృందం వెల్లడించింది. భారత్‌ను తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించింది. ఇప్పటికిపుడు సుమారు 356 నుంచి 492 వరకు అణు బాంబుల్ని తయారుచేయగలిగిన సత్తా భారత్‌ కలిగి ఉందని ఈ బృందం విశ్లేషించింది. ఈ మేరకు సాంకేతిక సామర్ధ్యాన్ని, ముడి సరుకును భారత్‌ కలిగి ఉందని ఈ బృందం అధ్యయనంలో తేల్చింది. 
 
ఇస్లామాబాద్‌లోని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌(ఐఎస్‌ఎస్‌ఐ)’ - భారత అరక్షిత అణు కార్యక్రమం - పేరుతో ఓ అధ్యయనాన్ని ప్రచురించింది. అణు బాంబుల తయారీలో భారత్‌ సత్తాపై గతంలో జరిగిన పలు అధ్యయనాలకు భిన్నంగా ఇందులో తేలినట్లు ఐఎస్‌ఎస్‌ఐ పేర్కొంది. సంక్లిష్టమైన భారత అణు కార్యక్రమంలోని వివిధ అంశాలపై వాస్తవాలను, సామర్ధ్యాలను వెల్లడించడమే ఈ అధ్యయనం ఉద్దేశమని పేర్కొంది.
 
కాగా, యురీ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, నియంత్రణ రేఖ వద్ద పాక్ రేంజర్లు యధేచ్చగా కాల్పులకు తెగబడుతున్నారు. ఈ దాడులకు ధీటుగానే భారత్ దళాలు కూడా స్పందిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పాక్ మేధావి బృందం వెల్లడించిన విషయాలు ఆ దేశ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించేవిలా ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమ-పెళ్లి పేరిట మోసం.. రెండుసార్లు గర్భం.. మరో యువతితో కానిస్టేబుల్ పెళ్లి